Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ

2 hours ago 1
ARTICLE AD
<p>న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన తర్వాత, మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్తున్న భారత చమురు నౌకపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శనివారం (ఏప్రిల్ 18న) భారత్&zwnj;లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. తద్వారా ఈ ఘటనపై అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది.&nbsp;</p> <p>భారత్&zwnj;లోని ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతహాలీని శనివారం సాయంత్రం 6:30 గంటలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమావేశం కోసం పిలిపించారు. ఇరాన్ రాయబారితో జరిగిన ఈ సమావేశంలో హర్మూజ్ జలసంధిలో భారత ట్యాంకర్&zwnj;పై జరిగిన కాల్పుల ఘటనపై భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది.</p> <p><strong>కాల్పులకు ముందు భారత నౌకలను వెనక్కి పంపిన ఇరాన్</strong><br />అందిన సమాచారం ప్రకారం, సుమారు 20 లక్షల బారెళ్ల ఇరాకీ ముడి చమురును తీసుకువెళ్తున్న ఒక పెద్ద భారత చమురు నౌకను శనివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉత్తర భాగంలో ఇరాన్ నేవీ లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనకు కొంత సమయం ముందే హర్మూజ్ జలసంధి నుండి 'జగ్ అర్నవ్', సన్మార్ హెరాల్డ్ అనే రెండు భారత నౌకలను బలవంతంగా వెనక్కి పంపినట్లు వార్తలు వచ్చాయి.&nbsp;</p> <p>భారత నౌకాదళం ఈ ఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. హర్మూజ్ జలసంధిలో వారి నౌకలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. అయితే భారత్&zwnj;కు చెందిన 2 డిస్ట్రాయర్లు, ఒక ఫ్రిగేట్, ఒక ట్యాంకర్ ఒమన్ గల్ఫ్&zwnj;లో మోహరించి ఉన్నాయి.</p> <p><strong>హర్మూజ్ జలసంధిలో మరోసారి పెరిగిన ఉద్రిక్తత</strong><br />నిజానికి హర్మూజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న కొన్ని నౌకలపై ఇరాన్ గన్&zwnj;బోట్లు కాల్పులు జరిపినట్లు బ్రిటన్ నౌకాదళం శనివారం తెలిపింది. కొన్ని వాణిజ్య నౌకలకు ఇరాన్ నావికాదళం నుండి రేడియో ద్వారా సందేశాలు అందాయని, జలసంధిని మళ్లీ మూసివేశామని, ఏ నౌకను ఇక్కడి నుండి వెళ్లేందుకు అనుమతించబోమని పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. దాంతో హర్మూజ్ లో పరిస్థితిమ మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.&nbsp;</p>
Read Entire Article