<p><strong>Team India Squad For Ireland & England:</strong> ముంబైలోని జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలకమైన సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ టూర్‌లతోపాటు ఆసియా గేమ్స్‌ కోసం జట్లను ఖరారు చేసింది. టీ 20 బాధ్యతలను సూర్యకుమార్ నుంచి శ్రేయస్ అయ్యర్ అందుకోనున్నారు. ఐపీఎల్‌లో తన విధ్వంసంతో బౌలర్లకు నిద్రలేకుండా చేసిన 15 ఏళ్ల చిచ్చరపిడుగు సూర్యవంశీ జాతీయ జట్టులోకి వచ్చేశాడు.</p>
<h2>జట్టు వివరాలు వెల్లడించిన అగార్కర్</h2>
<p>ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, షార్టెస్ట్ ఫార్మాట్ కోసం తమ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రాబోయే టోర్నమెంట్ సైకిల్స్‌లో స్థిరమైన విజయాలు సాధించేందుకు జట్టులో సమూలమైన మార్పులు చేసినట్టు వెల్లడించారు. టీ20-జట్టు పగ్గాలను ముంబై బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ తక్షణమే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. విస్తృతమైన చర్చల అనంతరం విధ్వంసకర మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతను అధికారికంగా నియమితులయ్యారు.</p>
<p>ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.</p>
<h2>ఇంగ్లాండ్ పర్యటన బృందం</h2>
<p>ఐర్లాండ్ టూర్ తర్వాత ఇదే ఆటగాళ్ల బృందం ఐరిష్ సముద్రాన్ని దాటి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి ప్రయాణిస్తుంది.</p>
<p>ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.</p>
<h2>ఆసియా క్రీడలకు జట్టు ఖరారు</h2>
<p>ఇంగ్లండ్ టూర్ తర్వాత జరిగే ఆసియా క్రీడల కోసం సీనియర్, జూనియర్లను మిగ్స్ చేసి టీమ్‌ను తయారు చేశారు. అందులో తెలుగు వాళ్లు ముగ్గురు ఉండటం ఆసక్తికర అంశం. ఆ జట్టుకు తిలక్ వర్మ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఆ టీంలోనే ఆల్‌రౌండర్ నితీష్‌ కుమార్ రెడ్డి, బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కి కూడా చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి ఆసియా జట్టులోకి వచ్చాడు. </p>
<p>ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ (విసి), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా</p>
<h2>సూర్యకుమార్‌పై వేటు </h2>
<p>చాలా కాలంగా ఫామ్‌లో లేని సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా తొలగించడమే కాకుండా జట్టు నుంచి కూడా తప్పించారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మను వైస్‌కెప్టెన్‌గా నియమించారు. </p>
<h2>యువ సంచలనానికి పిలుపు</h2>
<p>ఈ ఎంపికలో మరో సంచలన నిర్ణయం సూర్యవంశీదే. గత రెండు ఐపీఎల్ సీజన్స్‌లో దుమ్మురేపే పెర్ఫార్మెన్స్‌తో రికార్డుల మోత మోగిస్తున్న అతని ఆట చూసి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. దీంతో యూరోపియన్ పర్యటనలో అతను ఆట ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. </p>
<h2>పేస్ బౌలింగ్‌పైనే ఎక్కువ దృష్టి</h2>
<p>యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్థానిక పిచ్ పరిస్థితులకు అనుగుణంగా, పర్యటన బృందం ఎక్కువగా సీమ్ బౌలింగ్ ఆధారపడింది. అందుకే అలాంటి వారికే చోటు కల్పించారు. ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, రీసెంట్‌ సీమర్లు హర్షిత్ రాణా, ఎక్స్‌పీరియన్స్‌ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ జాతీయ జట్టులోకి చేరారు. పనిభారాన్ని తగ్గించడానికి సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కేవలం రెండు టూర్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆసియా గేమ్స్ ఆడే జట్టులో చోటు కల్పించారు. </p>
<h2>టూర్ షెడ్యూల్ ఇదే </h2>
<p>జూన్ 26- జూన్ 28 తేదీలలో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగే రెండు వరుస టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లతో టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 1న ఇంగ్లాండ్‌తో ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. </p>