Revanth Reddy: గుజరాత్‌లోని సబర్మతీ తీరంలా మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి

2 months ago 3
ARTICLE AD
<p>Telangana CM Revanth Reddy | న్యూఢిల్లీ: హైదరాబాద్&zwnj; నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మరింత అభివృద్ధి కోసం ఫ్యూచర్&zwnj; సిటీని నిర్మిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుజరాత్ లోని సబర్మతి తీరంలా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్నారు. ఫ్యూచర్&zwnj; సిటీకి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్&zwnj; బెంగళూరు మధ్య బుల్లెట్&zwnj; రైలు ప్రాజెక్టును కూడా కేంద్రాన్ని కోరినట్లు రేవంత్&zwnj;రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఎక్కడ అభివృద్ధి చెందబోతుందో, ఇంకా రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రపై కూడా ఆయన ప్రస్తావించారు. "తెలంగాణ రైజింగ్&zwnj; 2047" పేరుతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని ఆయన వెల్లడించారు.</p> <p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు అవకాశాలు, పెట్టుబడులు, పర్యావరణ పరిరక్షణ, ఇతర ముఖ్య అంశాలపై ప్రసంగించారు. రాజ&zwnj;కీయ సంక&zwnj;ల్పం ముఖ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలన కోసం రాజకీయ సంకల్పం ఎంత ముఖ్యమో చెప్పారు. పరిపాలనను ప్రభావవంతంగా నిర్వహించడానికి సక్రమమైన రాజకీయ సంకల్పం అవసరం అన్నారు.&nbsp;</p> <p><strong>తెలంగాణ మూడు భాగాలుగా విభజన</strong><br />రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణను మూడు విభాగాలుగా - కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ - గా విభజించినట్టు పేర్కొన్నారు. &lsquo;&lsquo;కోర్ అర్బన్ ప్రాంతంలో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాం. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం &lsquo;&lsquo;తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047&rsquo;&rsquo; రూపొందించాం. మా ఆలోచన భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించడం&rsquo;&rsquo; అని ఆయన చెప్పారు.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/09/19/656ff3665b6b72c118c0d243612f271d1758276408202233_original.jpg" /></p> <p><strong>మెట్రో విస్తరణ</strong><br />&lsquo;&lsquo;హైదరాబాద్&zwnj;లో 70 కిలోమీటర్ల మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం&rsquo;&rsquo; అని సీఎం తెలిపారు. &lsquo;&lsquo;హైదరాబాద్&zwnj;లో సబర్మతీ తీరంలా, మూసీ రివర్&zwnj;ఫ్రంట్&zwnj;ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టాం&rsquo;&rsquo; అని <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> పేర్కొన్నారు.</p> <p><strong>ఎలివేటెడ్ కారిడార్లు &amp; ఎలక్ట్రిక్ వాహనాలు</strong><br />2027 నాటికి &lsquo;&lsquo;హైదరాబాద్&zwnj;లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉండేలా చూస్తున్నాం. అందుకోసం ఈవీలకు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని &lsquo;&lsquo;రిజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి &lsquo;ప్రణాళికలు సిద్ధం చేసాం. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానంతో &lsquo;&lsquo;పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తాం. తెలంగాణలో పెట్టుబడుల భద్రత ఉంటుంది&rsquo;&rsquo; అని సీఎం తెలిపారు.</p> <p><strong>డ్రగ్స్ నిర్మూలన</strong><br />&lsquo;&lsquo;తెలంగాణలో డ్రగ్స్&zwnj;ను కంట్రోల్ చేశాం. దేశంలోనే డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు &lsquo;&lsquo;యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ&rsquo;&rsquo;ను ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీ నుంచి చదివినవారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ఒలింపిక్స్ పతకాలు సాధించే లక్ష్యంతో, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం&rsquo;&rsquo; అని ప్రకటించారు.</p> <p>తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లక్డ్) కావడంతో మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి గ్రీన్&zwnj;ఫీల్డ్ ఎక్స్&zwnj;ప్రెస్ హైవే నిర్మించాలనే ప్రణాళిక ఉంది. 2025, డిసెంబర్ 9 న, తెలంగాణ విజన్ డాక్యుమెంట్&zwnj;ను విడుదల చేస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో మనకు నష్టం జరుగుతోంది. ఆయన ఒక రోజు మోదీ నా ఫ్రెండ్ అంటారు, మరొకరోజు సుంకాలు పెంచుతారు&rsquo;&rsquo; అని సెటైర్లు వేశారు.&nbsp;</p>
Read Entire Article