NEET Paper Leak: నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేసిన NTA.. పేపర్ లీకేజీ కేసుపై సీబీఐ దర్యాప్తు

1 month ago 8
ARTICLE AD
<p>న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రద్దు అయింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని NTA &nbsp;ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేసినట్లు ప్రకటించింది.&nbsp;</p> <p><strong>రాజస్తాన్&zwnj;లో మొదలైన వివాదం..</strong><br />రాజస్థాన్&zwnj;లో నీట్ (NEET UG 2026) వివాదం చివరికి కొలిక్కి వచ్చింది. దాదాపు 125 ప్రశ్నలు లీకయ్యాయని.. ఆ క్వశ్చన్స్ ఓ శాంపిల్ పేపర్&zwnj;తో యథాతథంగా మ్యాచ్ కావడంతో వివాదం మొదలైంది. &nbsp;అప్పటి నుండి ఎగ్జామ్ రద్దు అవుతుందని వినిపించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంపై సిబిఐ (CBI) దర్యాప్తు చేయనుంది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మరాదని కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">In continuation of its press release dated 10 May 2026, the National Testing Agency wishes to inform candidates, parents, and members of the public of the following decisions taken in respect of NEET (UG) 2026. NTA had, on 8 May 2026, referred the matters then under consideration&hellip;</p> &mdash; National Testing Agency (@NTA_Exams) <a href="https://twitter.com/NTA_Exams/status/2054089524347871736?ref_src=twsrc%5Etfw">May 12, 2026</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు:</strong></p> <p>నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది.</p> <p>మే 3న జరిగిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు.</p> <p>ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే విడుదల చేస్తారు.</p> <p>అడ్మిట్ కార్డులను మళ్లీ జారీ చేస్తారు.</p> <p>విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.</p> <p>ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.</p> <p>ముందుగా జమ చేసిన ఫీజును తిరిగి చెల్లిస్తారు.</p> <p>పరీక్షా కేంద్రం ఎంపిక మునుపటిలాగే ఉంటుంది.</p> <p>ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించారు.</p> <p>విద్యార్థులు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.</p> <p>&nbsp;</p>
Read Entire Article