Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 

1 week ago 2
ARTICLE AD
<p><strong>Middle East War:&nbsp;</strong>పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్&zwnj;లోని టెహ్రాన్&zwnj;లో ఉన్న భారత రాయభార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది.&nbsp;</p> <p>మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న సంఘర్షణల దృష్ట్యా ఇరాన్&zwnj;లో ఉన్న భారతీయులందరూ రాబోయే 48 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ ఆదేశించింది. పౌరులు తాము ఎక్కడ ఉన్నరో అక్కడే ఉండాలని చెప్పింది. అనవసరంగా బయటకు రావద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల్లో ఉన్న వారు పై అంతస్తుల్లో ఉండొద్దని హితవు పలికింది. సురక్షితమైన కింది గదుల్లోకి మారాలని సూచించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉంటున్న వారు తమ గదులను వదిలి బయటకు రావద్దని,, నిరంతతరం ఎంబసీ బృందాలతో టచ్&zwnj;లో ఉండాలని స్పష్టం చేసింది.</p> <h3>ఎందుకూ ఈ ఆదేశాలు&nbsp;</h3> <p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్&zwnj;కు ఇచ్చిన గడువు ముగుస్తుంటడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని లేని పక్షంలో ఇరాన్&zwnj; ఒక నాగరితగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ సోషల్ మీడియా వేదికంగా హెచ్చరించారు. ఇరాన్&zwnj;లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించడంతో ఆయా ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఎంబసీ భావిస్తోంది.&nbsp;</p> <h3>ఆదేశాలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయంటే?</h3> <p>ఈ హెచ్చరికలు ఏప్రిల్ 7 నుంచి తక్షణం అమలులోకి వచ్చాయి. రాబోయే 48 గంటలు అంటే ఏప్రిల్ 9 వరకు అత్యంత కీలకమని ఎంబసీ పేర్కొంది,. ఈ కాలంలో ఎటువంటి రహదారి ప్రయాణాలు చేయకూడదని, ఒక వేళ అత్యవసరమైతే తప్పనిసరిగా ఎంబసీ సమన్వయంతోనే కదలాలని నిబంధన విధించింది.&nbsp;</p> <h3>ఎలా అప్రమత్తంగా ఉండాలి?</h3> <p>భారతీయ పౌరులు సహాయార్థం ఎంబసీ నిరంతరం పని చేసే హెల్ప్&zwnj;లైన్&zwnj;లు ఏర్పాటు చేసింది.&nbsp;</p> <p>అత్యవసర మొబైల్ నంబర్లు: +989128109115, +989128109102, +989128109109, +989932179359</p> <p>ఈమెయిల్: [email protected]</p> <p>పౌరులు అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని ఎంబసీ కోరింది. విద్యుత్ గ్రిడ్లు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక భవనాలకు వీలైనంత దూరంగా ఉండటం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించింది.&nbsp;</p>
Read Entire Article