Jupally Krishna Rao: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..

1 week ago 2
ARTICLE AD
<div class="container"> <div id="model-response-message-contentr_30354874157a125c" class="markdown markdown-main-panel enable-updated-hr-color" dir="ltr" aria-live="polite" aria-busy="false"> <p data-path-to-node="3">Minister Jupally In Metro Rail | హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నగరంలో సాదాసీదాగా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా మంత్రులకు ఉండే భారీ భద్రత, కాన్వాయ్ ప్రోటోకాల్స్&zwnj;ను పక్కన పెట్టి, ఆయన ఒక సామాన్య ప్రయాణికుడిలా మెట్రో ఎక్కారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులను దాటుకుని సకాలంలో చేరుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.</p> <p data-path-to-node="4">మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఎర్రమంజిల్ స్టేషన్&zwnj;కు చేరుకుని, క్యూలో నిల్చుని టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్&zwnj;ఫాంపైకి వెళ్లి సామాన్యులతో కలిసి రైలు ఎక్కారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకంగా సీటు కోసం ప్రయత్నించలేదు. మియాపూర్ వరకు సుమారు 30 నిమిషాల పాటు తోటి ప్రయాణికులతో కలిసే నిల్చుని ప్రయాణించారు. ఈ క్రమంలో ప్రయాణికులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, మెట్రోలోని సౌకర్యాలు, ప్రయాణ అనుభవాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.</p> <p data-path-to-node="4"><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/08/2cb0ce8ef7dc1b6df7c65426c7e529f21775635724473233_original.jpg" /></p> <p data-path-to-node="5">తమ మధ్యలో మంత్రిని చూసిన ప్రయాణికులు మొదట ఆశ్చర్యానికి గురైనప్పటికీ, ఆయన సాదాసీదా ప్రవర్తనను చూసి హర్షం వ్యక్తం చేశారు. యువత, ఇతర ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి చిరునవ్వుతో వారందరికీ సహకరించారు. పని ఉండటంతో అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయారు. నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, సమయాన్ని ఆదా చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైలు అత్యుత్తమ మార్గమని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అభిప్రాయపడ్డారు.</p> </div> </div>
Read Entire Article