IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?

14 hours ago 1
ARTICLE AD
<p>Southwest Monsoon | హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్&zwnj;లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. &nbsp;నైరుతి రుతుపవనాల రాకపై ఈ ఏడాది ఎల్&zwnj;నినో ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD Rain Alert) ప్రాథమిక అంచనా వేసింది. దీని కారణంగా అయితే ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన తొలి దశ నివేదికలో పేర్కొంది.</p> <p><strong>ఈ రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం&nbsp;</strong><br />సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు సెప్టెంబర్ 3వ వారం వరకు కొనసాగుతాయి. గత రెండేళ్లుగా వర్షపాతం సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈసారి ఎల్&zwnj;నినో ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. రుతుపవనాల చివరి దశ నాటికి ఎల్&zwnj;నినో మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు కురవడానికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.&nbsp;</p> <p><strong>ఏపీ, తెలంగాణలపై ఎల్ నినో ప్రభావం..</strong></p> <p>దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు <a title="కర్ణాటక" href="https://telugu.abplive.com/topic/Karnataka" data-type="interlinkingkeywords">కర్ణాటక</a>లో వర్షపాతం మిశ్రమంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరికొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు లోటు లేదని అంచనా వేయగా.. దక్షిణ తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధిక వర్షాలు కురస్తాయని అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది.&nbsp;</p> <p><strong>సాధారణం కంటే ఎక్కువ వర్షాలు</strong><br />కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాయలసీమలోని కడప, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.</p> <p><strong>ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం: స్కైమెట్ అంచనా</strong><br />భారత్&zwnj;లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ఇటీవల వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో, రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం బలంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ నాలుగు నెలల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉండాలి, కానీ ఈసారి అందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.</p> <p>భారత్&zwnj;లో ఏడాది పొడవునా నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 70 శాతం కేవలం ఈ నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. దేశ జీడీపీకి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత ప్రాణాధారం. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేటికీ జీవనోపాధి కోసం నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.</p> <p>రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు సాధారణంగా జూన్, జూలై నెలల్లోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సరైన సమయానికి రావడం, దేశవ్యాప్తంగా త్వరగా విస్తరించడం పంటల దిగుబడికి చాలా అవసరం. సాధారణంగా జూన్ 1న లేదా జూన్ మొదటి వారంలో కేరళను తాకే ఈ రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అయితే, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ విస్తరణలో గానీ, వర్షాల తీవ్రతలో గానీ మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.</p>
Read Entire Article