H1B Visa ఫీజుల పెంపుతో అమెరికాకే నష్టం, భారత్ కు లాభం: NITI Aayog మాజీ సీఈవో అమితాబ్ కాంత్

2 months ago 3
ARTICLE AD
<p style="text-align: justify;">న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో భారత్ కంటే అగ్రరాజ్యానికే అధిక నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా హెచ్-1బి వీసా ఫీజులను భారీగా పెంచింది. ట్రంప్ నిర్ణయంతో భారతీయులే ఎక్కువగా నష్టపోతారని అంతా భావిస్తున్నారు. అయితే, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ శనివారం (సెప్టెంబర్ 20)న మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా ఫీజులను పెంచడం వల్ల అమెరికాకే నష్టం జరుగుతుందని, ఇది భవిష్యత్తులో భారతదేశానికి లాభదాయకంగా మారుతుందని అన్నారు.</p> <p style="text-align: justify;">H1B visa Fee Hike చర్య ప్రపంచంలోని ప్రతిభావంతులకు అమెరికా తలుపులు మూసినట్లుగా కనిపిస్తుందని, ఇది బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్&zwnj;లలో ఆవిష్కరణలు, పేటెంట్లు, స్టార్టప్&zwnj;ల మరిన్ని క్రియేట్ చేయడంతో సహాయపడుతుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అన్నారు.</p> <p style="text-align: justify;"><strong>ఇంతకీ అమితాబ్ కాంత్ ఏమన్నారు?</strong></p> <p style="text-align: justify;">జీ-20కి చెందిన షెర్పాగా పనిచేసిన అమితాబ్ కాంత్ అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంపై స్పందించారు. ట్రంప్ కొన్ని వలసేతర కార్మికుల ప్రవేశాన్ని నిషేధించిన కొన్ని గంటల తర్వాత, అమెరికాలో పనిచేయడానికి భారత్&zwnj;తో సహా ఉద్యోగులను నియమించుకునే వీసాలపై ఏడాదికి $1,00,000 ఫీజు విధించడం భారత్&zwnj;కు మేలు చేస్తుందన్నారు.&nbsp;</p> <blockquote class="twitter-tweet" data-media-max-width="560"> <p dir="ltr" lang="en">Donald Trump&rsquo;s 100,000 H-1B fee will choke U.S. innovation, and turbocharge India&rsquo;s. By slamming the door on global talent, America pushes the next wave of labs, patents, innovation and startups to Bangalore and Hyderabad, Pune and Gurgaon . India&rsquo;s finest Doctors, engineers,&hellip;</p> &mdash; Amitabh Kant (@amitabhk87) <a href="https://twitter.com/amitabhk87/status/1969246119470514623?ref_src=twsrc%5Etfw">September 20, 2025</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;">అమితాబ్ కాంత్ ఎక్స్ లో ఒక పోస్ట్&zwnj;లో ఇలా రాసుకొచ్చారు. 'డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 మిలియన్ డాలర్ల ఫీజు హెచ్-1బి ఫీజు అమెరికా స్టార్టప్&zwnj;లను నిరోధిస్తుంది. అదే సమయంలో ఈ నిర్ణయం భారతదేశంలో స్టార్టప్&zwnj;లకు ఊపు తెస్తుంది. ప్రపంచ ప్రతిభావంతుల కోసం తలుపులు మూసివేయడం ద్వారా, అమెరికా స్టార్టప్&zwnj;ల తదుపరి వేవ్ భారత్&zwnj;లోని బెంగళూరు, హైదరాబాద్, పూణేలతో పాటు గురుగ్రామ్ వైపు మళ్లుతుంది' అని అన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభివృద్ధికి కేంద్రంగా మన దేశం మారనుందని ఆశాభావంవ్యక్తం చేశారు. హెచ్1బీ వీసాలపై భారీగా ఫీజు వసూలు నిర్ణయం భారతదేశ అభివృద్ధికి, పురోగతికి దోహదం చేసే అవకాశం ఉండగా.. మరోవైపు ట్రంప్ చర్యలు అమెరికాకే నష్టం చేస్తాని అభిప్రాయపడ్డారు.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>H-1B వీసా ఫీజు పెంచడానికి కారణం</strong></p> <p style="text-align: justify;">ట్రంప్ పరిపాలన మాట్లాడుతూ, $100,000 ఫీజు దేశానికి తీసుకురాబడే వ్యక్తులు నిజంగా అత్యంత నైపుణ్యం కలిగినవారని మరియు అమెరికన్ కార్మికులను భర్తీ చేయరని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. హెచ్-1బి వీసా మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది మరియు మరో మూడు సంవత్సరాలకు పునరుద్ధరించవచ్చు.</p> <p style="text-align: justify;">అమెరికా అధ్యక్షుడు 'ది గోల్డ్ కార్డ్' అనే కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా సంతకం చేశారు, ఇది అసాధారణ సామర్థ్యం కలిగిన విదేశీయుల కోసం కొత్త వీసా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడింది, వారు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారు.</p> <p style="text-align: justify;">&nbsp;</p>
Read Entire Article