Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!

2 months ago 3
ARTICLE AD
<p><strong> Etela Rajender:&nbsp;</strong>బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్&zwnj;కు ఊపిరి ఆడటం లేదని సన్నిహితులు చెబుతున్నారు. కమలం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే పదే పదే ఆత్మగౌరవం, ప్రజలు, పదవులు, గడడిపోచలు అనే కామెంట్స్ తరచూ వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్&zwnj;ఎస్&zwnj;లో ఉన్నప్పుడు కూడా అధినాయకత్వంతో విభేదాలు వచ్చినట్టు ఇలాంటి కామెంట్స్ చేసిన విషయాన్ని ఆయన్ని దగ్గరగా గమనించిన వ్యక్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ ఈ మధ్య తరచూ చేస్తున్నారు.&nbsp;</p> <p>బీఆర్&zwnj;ఎస్&zwnj;కు రాజీనామా చేసి వచ్చిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్&zwnj; పరపతి బీజేపీలో బాగానే నడిచింది. మొన్నటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నాయకుల పేర్లు పరిశీలించినప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ఒకానొక దశలో ఈటలే <a title="తెలంగాణ బీజేపీ" href="https://telugu.abplive.com/topic/Telangana-BJP" data-type="interlinkingkeywords">తెలంగాణ బీజేపీ</a> అధ్యక్షుడు కాబోతున్నారని ప్రచారం కూడా జరిగిపోయింది. ఆయన ప్రధానమంత్రితో భేటీ కావడంతో ఆ ప్రచారం నిజమని కూడా వార్తలు వచ్చాయి.&nbsp;</p> <p>సడెన్&zwnj;గా ఎవరూ ఊహించని రామచంద్రరావును బీజేపీ స్టేట్&zwnj; ప్రెసిడెంట్&zwnj;గా చేశారు. దీంతో ఒక్కసారిగా ఈటల శిబిరంలో నిరాశ అలుముకుంది. దీనికి తోడు ఆయన ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారనే ప్రచారం ఆయన వర్గంలో గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు ఆయన కోవర్టుగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి దూరం చేసే పనులను ప్రత్యర్థులు చేస్తున్నారని సన్నిహితులు వాపోతున్నారు.&nbsp;</p> <p>కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఈటల పార్టీలో కష్టాలు మరింత ఎక్కువయ్యాయనే మాట పదే పదే వినిపిస్తోంది. క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారనే వాదనకు బలం చేకూరే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సెప్టెంబర్&zwnj; 17న కేంద్రమంత్రి రాజ్&zwnj;నాథ్&zwnj;సింగ్&zwnj; హైదరాబాద్&zwnj;లో పర్యటించారు. ఈ పర్యటనలో ఈటలకు అవమానం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్&zwnj;నాథ్&zwnj;ను కలిసేందుకు ఒక పాస్ అడిగనట్టు తెలుస్తోంది. ఇచ్చేందుకు &nbsp;పార్టీ ముఖ్యులు అంగీకరించలేదని బోగట్టా. ఆ పాస్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్టు సన్నిహితులు చెబుతున్నారు. వెంటనే అక్కడే ఉన్న కొందరు ఆయన్ని శాంతిపజేసి పరిస్థితి చక్కదిద్దారని అంటున్నారు. &nbsp;&nbsp;</p> <p>ఈ మధ్య ఫామ్&zwnj;హౌస్&zwnj;తో తన నియోజకవర్గంలో కలిసిన కార్యకర్తలను ఉద్దేశించి చేసిన కామెంట్స్&zwnj; మాదిరిగానే గురువారం కూడా ఆత్మగౌరం, పదవులకు రాజీనామాపై మాట్లాడారు. కోరిన పదవులు దక్కపోయినా బాధపడబోమని కానీ ఆత్మగౌరవం లేకపోతే కచ్చితంగా కొట్లాడాతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా వదిలేశామని గుర్తు చేశారు. 20 ఏళ్లలో ఎవరైనా నాలుగుసార్లు ఎమ్మెల్యే అవుతారని కానీ తాను మాత్రం 7 సార్లు ఎమ్మెల్యే అయ్యానని రాజీనామాల విషయాన్ని ప్రస్తావించారు.అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీస గౌరవం దక్కడం లేదన్న &nbsp;అసంతృప్తితో ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. &nbsp;</p> <p>ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ ఈటల రాజేందర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే పార్టీలో తనను అవమానిస్తున్న వాళ్లకు, <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> అధినాయకత్వానికి సంకేతాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే" మనం నిన్న(సెప్టెంబర్&zwnj; 17) ఎగురవేసుకున్న జాతీయ జెండా తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తు చేసింది. దేశంతో పాటు మనకు స్వతంత్రం రాలేదని, దానికోసం మన పూర్వీకులు పడ్డ కష్టం భావితరాలకు అందించడమే నిన్న వేడుకల లక్ష్యం. అభివృద్ధి కావాలా ? ఆత్మగౌరవం కావాలా అంటే ముందు కోరుకొనేది ఆత్మగౌరవం, స్వయం పాలన.. &nbsp;కానీ ఆనాడు అది లేకుండే. ఆత్మగౌరవం కోల్పోయిన తరువాత వచ్చే ఏ పదవైనా గడ్డి పోచతో సమానం. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలాగా విసిరి వేసినం. ఇరవై ఏళ్ళల్లో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 7 సార్లు అయ్యాం. మాకు ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలని కొట్లాడినం." అని అన్నారు.</p>
Read Entire Article