<p><strong>Delimitation Bill 2026: </strong>భారత రాజకీయ యవనికపై నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. దేశ భవిష్యత్‌ను, ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని సమూలంగా మార్చేసే మూడు అత్యంత కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌స స్థానాల పెంపు, గతంలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌లను కార్యాచరణలోకి తీసుకురావడమే ఈ సమావేశాల ప్రధాన అజెండా. </p>
<h3>సభ ముందుకు కీలక బిల్లులు </h3>
<p>ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంట్‌లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. అనంతరం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ‌ మేఘ్వాల్‌ 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు నియోజకవర్గాల పునర్విభజనకు, స్థానాల పునః పంపిణీకి మార్గం సుగమం చేస్తోంది. ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతున్న ప్రక్రియను పక్కన పెట్టి, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను మార్చాలనని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. </p>