స్పిరిట్ ఓటీటీ రైట్స్ కి దిమ్మతిరిగే డీల్

1 day ago 1
ARTICLE AD

కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం అనౌన్సమెంట్ నుంచే క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా మారిపోయింది. డిసెంబర్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స్పిరిట్ మూవీ కి సంబందించిన ప్రభాస్ లేని సన్నివేశాలను రీసెంట్ గా గోవాలో చిత్రీకరించారు సందీప్ రెడ్డి వంగ.

క్రేజీ పాన్ ఇండియా మూవీ గా మారిన స్పిరిట్ చిత్రం ఓటీటీ డీల్ పై ఇప్పుడొక న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్పిరిట్ డిజిటల్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దాదాపుగా రూ. 250 కోట్లు స్పిరిట్ మేకర్స్ కి ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. చాలా కొద్దిమేర మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ఈ రేంజ్ డీల్ అంటే మాములు విషయం కాదు.

అంతేకాకుండా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి డుమ్రి నటిస్తుంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. 

Read Entire Article