ARTICLE AD
ఆర్.ఆర్.ఆర్ తర్వాత బాలీవుడ్ క్యూటీ అలియా భట్ ఇమ్మిడియట్ గా ఎన్టీఆర్-కొరటాల కలయికలో మొదలుకాబోయే దేవర చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు. కానీ అలియా భట్ ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవడం, ఆమె దేవర నుంచి తప్పుకోవడంతో దేవర లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పడు అలియా భట్ దేవర నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలైపోయారు.
కానీ ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది. అంటే అలియా భట్ కి తెలుగు లో ఓ పాన్ ఇండియా ఆఫర్ వచ్చింది అనే వార్త చూసి అది ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ లోనే అని మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్-నీల్ కలయికలో మొదలైన పాన్ ఇండియా మూవీ డ్రాగన్ లో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్.
అయితే ఇప్పుడు డ్రాగన్ చిత్రంలోకి అలియా భట్ ఎంటర్ అవుతుంది, ఆమెను ఓ కీలక పాత్ర కోసం ప్రశాంత్ నీల్ సంప్రదించారనే వార్త చూసాక అబ్బ దేవర లో మిస్ అయినా ఇప్పుడు డ్రాగన్ ఎన్టీఆర్ కోసం దిగుతుంది ఈ క్యూటి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ వార్త నిజామా, లేదంటే గాలి వార్త అనేది తెలియాల్సి ఉంది.

1 day ago
1