<p><strong>Govt tells WhatsApp and telegram to do mandatory SIM : </strong> కమ్యూనికేషన్ యాప్స్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. <a title="వాట్సాప్" href="https://telugu.abplive.com/topic/whatsapp" data-type="interlinkingkeywords">వాట్సాప్</a>, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సిమ్ కార్డ్ బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమాటిక్‌గా ఆగిపోతాయి. ఈ నిబంధనలు 90 రోజుల్లో అమలులోకి వస్తాయి. సైబర్ నేరాలను అరికట్టడానికి ఈ చర్యలు అవసరమని కేంద్రం నిర్ణయించింది. </p>
<p><strong> యాప్స్‌కు తప్పనిసరి సిమ్ బైండింగ్: ఎలా పనిచేస్తుంది?</strong></p>
<p>కేంద్రం జారీ చేసిన 'టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) రూల్స్, 2025' ప్రకారం, కమ్యూనికేషన్ సేవలు అందించే OTT యాప్స్‌ను 'టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీస్ (TIUEs)'గా పేర్కొంటారు. ఈ యాప్స్ తమ సేవలకు సిమ్ కార్డ్‌తో అనుసంధానం (బైండింగ్) అవ్వాలి. </p>
<p><strong> సిమ్ ధ్రువీకరణ:</strong> యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే యూజర్ సిమ్ కార్డ్‌ను ధ్రువీకరించాలి. ఆ తర్వాత, డివైజ్‌లో ఆ సిమ్ మాత్రమే ఉంటేనే యాప్ పనిచేయాలి.<br /><strong> సిమ్ తొలగించినా లాగౌట్:</strong> సిమ్ కార్డు తీసేస్తే లేదా ఫోన్ మార్చితే యాప్ ఆటోమాటిక్‌గా లాగౌట్ అవుతుంది. మళ్లీ లాగిన్ కావాలంటే, ఆ సిమ్‌తో మాత్రమే పునఃధ్రువీకరణ చేయాలి.<br /><strong> వెబ్ వెర్షన్ పరిమితి:</strong> యాప్‌ను వెబ్ బ్రౌజర్‌లో ఉపయోగిస్తే, ప్రతి 6 గంటలకు లాగౌట్ అవుతుంది. మళ్లీ సేవలు పొందాలంటే QR కోడ్ ద్వారా మొబైల్ సిమ్‌తో లాగిన్ అవ్వాలి.<br /><strong> డీయాక్టివేటెడ్ సిమ్‌లు: </strong>డీయాక్టివేట్ అయిన లేదా ఇన్‌వాలిడ్ సిమ్‌తో యాప్ సేవలు కొనసాగకూడదు. ఇది సైబర్ నేరస్థులు డీయాక్టివ్ సిమ్‌లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది.</p>
<p>ప్రస్తుతం ఈ యాప్స్ ఇన్‌స్టాలేషన్ సమయంలో సిమ్‌ను ధ్రువీకరిస్తున్నా, సిమ్ తొలగించినా లేదా డీయాక్టివేట్ చేసినా సేవలు కొనసాగుతున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en"><a href="https://twitter.com/hashtag/BreakingNow?src=hash&ref_src=twsrc%5Etfw">#BreakingNow</a>: The DoT has mandated that communication OTT apps continuously bind the devices to the SIM card (and therefore the mobile number) that was used to register the account.<br /><br />What does this mean for an average WhatsApp, Telegram, Signal user like you & me? (1/3)</p>
— Aashish Aryan (@cubscribe) <a href="https://twitter.com/cubscribe/status/1994711553275564325?ref_src=twsrc%5Etfw">November 29, 2025</a></blockquote>
<p><strong> సైబర్ నేరాలు, దుర్వినియోగం అరికట్టడం</strong></p>
<p>భారతదేశంలో OTT కమ్యూనికేషన్ యాప్స్ ద్వారా సైబర్ నేరాలు, మోసపూరిత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే నేరస్థులు ఈ యాప్స్‌ను వాడుకోవడం సులభమవుతోందని DoT అధికారులు చెబుతున్నారు. సిమ్ బైండింగ్‌తో యూజర్ ఐడెంటిటీ ధృవీకరణ మరింత బలపడుతుంది. సైబర్ నిపుణులు. ఇది మోసాలు, ఫిషింగ్, టెరర్ యాక్టివిటీలను 30-40% తగ్గిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఇది యూపీఐ పేమెంట్ యాప్స్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సిమ్ బైండింగ్ మోడల్‌కు సమానం. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/hyderabad/do-you-know-why-the-land-of-kokapet-turned-into-gold-228935" width="631" height="381" scrolling="no"></iframe></p>