Tirumala Vaikuntha Dwara Darshan: ఇంట్లో కూర్చొనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందండి - ఇదిగో ఈ పద్దతిలో ట్రై చేయండి!

1 week ago 2
ARTICLE AD
<p><strong>Tirumala Vaikuntha Dwara Darshan tickets will be allotted through Lucky Dip: &nbsp;</strong> తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి.</p> <p><strong>ఎల&zwnj;క్ట్రానిక్&zwnj; డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ</strong></p> <p>వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎల&zwnj;క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ స&zwnj;భ్యులంద&zwnj;రికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.</p> <p><strong>నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎల&zwnj;క్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం</strong></p> <p>మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎల&zwnj;క్ట్రానిక్&zwnj; &nbsp;డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎల&zwnj;క్ట్రానిక్&zwnj; డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి.</p> <p><strong>వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం</strong></p> <p><a title="వాట్సాప్" href="https://telugu.abplive.com/topic/whatsapp" data-type="interlinkingkeywords">వాట్సాప్</a> బాట్ ద్వారా ఎల&zwnj;క్ట్రానిక్&zwnj; &nbsp;డిప్ రిజిస్ట్రేష&zwnj;న్ న&zwnj;మోదు చేసుకునే భ&zwnj;క్తులు ఏపీ గ&zwnj;వ&zwnj;ర్న&zwnj;మెంట్ స&zwnj;ర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంత&zwnj;రం ఇంగ్లీష్&zwnj;, తెలుగు భాష&zwnj;ల&zwnj;ను సెల&zwnj;క్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి.</p> <p>అనంత&zwnj;రం మీరు ఎంచుకున్న భాష&zwnj;లో స&zwnj;ర్వీసెస్ విండో క&zwnj;నిపిస్తుంది. ఆ స&zwnj;ర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ స&zwnj;ర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. త&zwnj;ర్వాత టీటీడీ టెంపుల్ స&zwnj;ర్వీసెస్&zwnj; ఓపెన్ చేయ&zwnj;గానే వైకుంఠ ద్వార ద&zwnj;ర్శ&zwnj;నం (డిప్&zwnj;) రిజిస్ట్రేష&zwnj;న్ అనే ఆప్ష&zwnj;న్ వ&zwnj;స్తుంది. ఇక్క&zwnj;డ ఇంగ్లీష్&zwnj;, తెలుగు, త&zwnj;మిళ్&zwnj;, క&zwnj;న్న&zwnj;డ&zwnj;, హిందీ భాష&zwnj;లను ఎంపిక చేసుకుని క&zwnj;న్ఫ&zwnj;ర్మ్ చేయాలి. త&zwnj;ర్వాత చిరునామా, పిన్ కోడ్ న&zwnj;మోదు చేయాలి.</p> <p>అనంత&zwnj;రం డిసెంబ&zwnj;ర్ 30, 31, జ&zwnj;న&zwnj;వ&zwnj;రి 1వ తేదిల్లో మీకు ద&zwnj;ర్శ&zwnj;నం కావాల్సిన రోజుల&zwnj;ను లేదా మూడు రోజుల&zwnj;ను ప్ర&zwnj;యారిటీగా ఎంపిక చేసుకోవ&zwnj;చ్చు. త&zwnj;ర్వాత భ&zwnj;క్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వ&zwnj;య&zwnj;స్సు, లింగం, ఆధార్ నంబ&zwnj;ర్, మొబైల్ నంబ&zwnj;ర్&zwnj; న&zwnj;మోదు చేయాలి. ఆ త&zwnj;ర్వాత వివ&zwnj;రాల&zwnj;ను స&zwnj;రి చూసుకుని SUBMIT చేయాల్సి ఉంటుంది. ఒక&zwnj;సారి న&zwnj;మోదు చేసిన పేర్ల&zwnj;ను మార్చ&zwnj;డానికి వీలు ప&zwnj;డ&zwnj;దు.</p> <p>ఆధార్ నంబ&zwnj;ర్&zwnj;, పిన్ కోడ్ ను త&zwnj;ప్పుగా న&zwnj;మోదు చేస్తే మార్చుకోవ&zwnj;డానికి అవ&zwnj;కాశం ఉంటుంది. భ&zwnj;క్తుల వివ&zwnj;రాలు విజ&zwnj;య&zwnj;వంతంగా SUBMIT చేయ&zwnj;గానే ACKNOWLODGEMENT మెసేజ్ వ&zwnj;స్తుంది. ఆ మెసేజ్ రిఫ&zwnj;రెన్సు నెంబ&zwnj;ర్ గా ప&zwnj;రిగ&zwnj;ణించ&zwnj;డం జ&zwnj;రుగుతుంది. మొబైల్ నెంబ&zwnj;ర్, ఆధార్ కార్డుకు ఒక&zwnj;సారి మాత్ర&zwnj;మే రిజిస్ట్రేష&zwnj;న్ కు అవ&zwnj;కాశం ఉంటుంది.</p> <p><strong>మొదటి మూడు రోజులు SED, శ్రీవాణి దర్శనాలు రద్దు</strong></p> <p>వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి ద&zwnj;ర్శ&zwnj;న టికెట్లు జారీ&nbsp; చేయరు.&nbsp;పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది.</p> <p><strong>జనవరి 2 నుండి 8వ తేది వ&zwnj;ర&zwnj;కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ</strong></p> <p>వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.&nbsp;</p> <p><strong>డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు</strong></p> <p>వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు.</p> <p><strong>స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం</strong></p> <p>వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది.</p> <p><strong>ఆన్ లైన్&zwnj; ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం</strong></p> <p>రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాత&zwnj;లు వారి కుటుంబ స&zwnj;భ్యుల&zwnj;కు డిసెంబ&zwnj;ర్ 30 నుండి జ&zwnj;న&zwnj;వ&zwnj;రి 8వ తేది వ&zwnj;ర&zwnj;కు రోజుకు 125 మందికి ద&zwnj;ర్శ&zwnj;నం క&zwnj;ల్పించ&zwnj;నున్నారు. రూ.ల&zwnj;క్ష నుండి రూ.99 ల&zwnj;క్ష&zwnj;ల వ&zwnj;ర&zwnj;కు విరాళం ఇచ్చిన దాత&zwnj;ల&zwnj;కు డిసెంబ&zwnj;ర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జ&zwnj;న&zwnj;వ&zwnj;రి 1వ తేది నుండి 8వ తేది వ&zwnj;ర&zwnj;కు రోజుకు 2వేల మందికి ద&zwnj;ర్శ&zwnj;నం క&zwnj;ల్పించ&zwnj;నున్నారు. వీరు కూడా ఆన్ లైన్&zwnj; అప్లికేష&zwnj;న్ లో డిసెంబ&zwnj;ర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్ల&zwnj;ను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/news/new-labor-codes-10-key-changes-every-employee-should-know-228432" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>&nbsp;</p>
Read Entire Article