Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!

11 months ago 7
ARTICLE AD
<p><strong>TTD Arrangements For Vaikunta Ekadashi Event:&nbsp;</strong>తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshan) ఏర్పాట్లపై తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యతో కలిసి మంగళవారం అన్నమయ్య భవన్&zwnj;లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.&nbsp;</p> <p><strong>టీటీడీ నిర్ణయాలివే..</strong></p> <ul> <li>వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్&zwnj;లైన్&zwnj;లో విడుదల చేస్తారు.</li> <li>ఈ నెల 24న ఉదయం 11 గంటలకు 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్&zwnj;లైన్&zwnj;లో విడుదల చేస్తారు.</li> <li>జనవరి 10 నుంచి 19 వరకూ 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలోని ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు.</li> <li>తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు.</li> <li>టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తారు. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు.</li> <li>వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 04:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కాగా.. అధిక రద్దీ కారణంగా ఆ రోజున ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు.</li> <li>ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్వర్ణరథం, ఉదయం 5:30 నుంచి 6:30 వరకూ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతాయి.&nbsp;గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.</li> <li>టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.</li> <li>వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయం.</li> <li>ప్రతి రోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు.. అదనంగా 3.50 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.</li> </ul> <p><strong>Also Read: <a title="Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్&zwnj;లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్" href="https://telugu.abplive.com/andhra-pradesh/rajamundry/kakinada-collector-says-1320-tonnes-of-pds-rice-found-in-stella-ship-at-port-190862" target="_blank" rel="noopener">Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్&zwnj;లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్</a></strong></p>
Read Entire Article