<p>Trump Media Technology Group: తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (TMTG) డైరెక్టర్ ఎరిక్ స్వైడర్, భారత్ ఫ్యూచర్ సిటీ మరియు తెలంగాణలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. ఈ పెట్టుబడి తదుపరి 10 సంవత్సరాల్లో జరగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పెట్టుబడి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడి హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. </p>
<p>భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ వద్ద ఏర్పాటు చెస్తున్న కొత్త నగరంలో ప్రధానంగా ఈ పెట్టుబడి ఉంటుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, డిసెంబర్ 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఈ సమ్మిట్‌లో 2,000 మంది డెలిగేట్లు, 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సమ్మిట్‌లో రూ. 3 లక్షల కోట్ల విలువైన MoUలు సంతకం చేసే అవకాశం ఉంది. TMTG పెట్టుబడి దీని మొదటి పెద్ద ప్రకటనలలో ఒకటి. </p>
<p>ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్, డొనాల్డ్ ట్రంప్ సంబంధిత మీడియా కంపెనీగా ప్రసిద్ధి చెందినది. 2021లో ఈ కంపెనీని ఫ్లోరిడాలో ప్రారంభించారు. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, ఫిన్‌టెక్ సేవలపై ఫోకస్ చేస్తుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ ను ఈ కంపెనీ నుంచే రూపొందించారు. ఈ ఫ్లాట్ ఫాంకు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అలాగే ట్రూత్ పేరుతో స్ట్రీమింగ్ సర్వీస్ కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. న్యూస్, క్రిస్టియన్ కంటెంట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ వంటివి ప్లాన్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్ , ఫిన్‌టెక్ బ్రాండ్ ట్రంప్ డాట్ ఎఫ్ఐక కూడా ఉంది. ఈ సంస్థకు చైర్మన్ గా ట్రంప్ ఉన్నారు. సుమారు $3.23 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. గ్లోబల్ గా విస్తరించాలన్న లక్ష్యంతో మొదటి సారి.. హైదరాబాద్‌లోనే భారీ పెట్టుబడులు ప్రకటించారు. </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">I am grateful for the opportunity to invest here in Telangana, and over the next 10 years, We will contribute to building the future city and driving its development.<br /><br />— Eric Swider, Director, Trump Media & Technology Group<a href="https://twitter.com/hashtag/TelanganaRisingGlobalSummit2025?src=hash&ref_src=twsrc%5Etfw">#TelanganaRisingGlobalSummit2025</a> <a href="https://twitter.com/hashtag/TelanganaRising2047?src=hash&ref_src=twsrc%5Etfw">#TelanganaRising2047</a>… <a href="https://t.co/MQJfObAyLq">pic.twitter.com/MQJfObAyLq</a></p>
— Aapanna Hastham (@AapannaHastham) <a href="https://twitter.com/AapannaHastham/status/1997974103106719769?ref_src=twsrc%5Etfw">December 8, 2025</a></blockquote>
<p>ఈ పెట్టుబడి ద్వారా తెలంగాణలో మీడియా, టెక్నాలజీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో విస్తరణ జరగనుందని అధికారులు తెలిపారు. సమ్మిట్‌లో నోబెల్ లారియేట్ అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్-షా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరెమీ జర్గెన్స్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> కీనోట్ అడ్రస్‌లో, "తెలంగాణను ప్రపంచంలో బెస్ట్ రాష్ట్రంగా మార్చాలన్న మా కల. ఈ పెట్టుబడులు ఆ కలను నెరవేర్చడానికి సహాయపడతాయి" అని పేర్కొన్నారు. ఈ ప్రకటన తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని, యువతకు లక్షలాది ఉద్యోగాలు సృష్టించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/10-easy-ways-to-make-money-through-chat-gpt-229773" width="631" height="381" scrolling="no"></iframe></p>