Telangana Politics: నేను కోరడంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల ఆపేశారు: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

3 months ago 9
ARTICLE AD
<p>హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో శనివారం &lsquo;నీళ్లు-నిజాలు&rsquo; అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష <a title="బీఆర్ఎస్ పార్టీ" href="https://telugu.abplive.com/topic/BRS-Party" data-type="interlinkingkeywords">బీఆర్ఎస్ పార్టీ</a>పై, మాజీ సీఎం కేసీఆర్&zwnj;పై నిప్పులు చెరుగుతూనే.. మా నీటిని అడ్డుకోవడానికి ఎవరొస్తారో రావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్&zwnj;లకు సైతం సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధమని సభ సాక్షిగా ప్రకటించారు.</p> <p>తాను కోరడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. తనపై ప్రతిపక్ష నేతలు అడ్డగోలుగా మాట్లాడితే కేసీఆర్ నాలుక కోస్తా అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కృష్ణా జలాల అంశంతో పాటు తనపై దుష్ప్రచారం చేసినా, అడ్డగోలుగా వాగినా.. తోలుతీస్తా అన్న వారి నాలుక కోస్తా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.</p> <p><strong>తెలంగాణ కోసం టీడీపీని వదిలేశాను..</strong><br />నీటి పంకాలు, కృష్ణా జలాలపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తాను తెలంగాణ కోసం <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>ని వదిలేశా అన్నారు. తన ఎదుగుదలకు దోహదపడిన నాయకుడిని కూడా కాదనుకున్నా అని చెప్పారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తి మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని తెలిపారు.&nbsp;</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid0zGmoGBUEPoYhLbYwBpZMdFhgCgPmGPgmnveQUgD3g9EBM7wKkr2eQ5NfVmvkvqAEl&amp;show_text=true&amp;width=500" width="500" height="725" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ఈ విషయంపై ఏమైనా అనుమానం ఉంటే అసెంబ్లీ తరపున నిజనిర్ధారణ కమిటీ వేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే నీటి వాటాలపై చర్చకు వస్తామని కండీషన్ పెట్టి పనులు ఆపించిన చరిత్ర తమదన్నారు. సీఎం కూర్చీలో కూర్చుని రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానన్నారు.</p> <p>2016లో కేసీఆర్&zwnj; హయాంలోనే గోదావరి - బనకచర్లకు పునాది పడిందని రేవంత్&zwnj;రెడ్డి ఆరోపిచారు. గోదావరి నది నుంచి మిగులు జలాలు ఉన్నాయని, వాటిని వాడుకోవాలని కేంద్ర జల్&zwnj;శక్తిశాఖ భేటీలో కేసీఆర్&zwnj; చెప్పారని సీఎం అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిన మిగులు జలాల మాటలతోనే ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్లాన్ చేశారని ఆరోపిచారు. కేంద్ర జల్&zwnj;శక్తిశాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరైన కేసీఆర్.. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు కేటాయించగా, &nbsp;తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించినా కేసీఆర్&zwnj; అంగీకరించారని పేర్కొన్నారు.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/wBLqwdQpZkM?si=O4c0b1CAsJQnnoo-" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>కృష్ణా ట్రైబ్యునల్&zwnj; తుదితీర్పు వచ్చే వరకు ఈ నిర్ణయాన్ని పాటిస్తామని సైతం కేంద్రం వద్ద <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> సంతకం చేశారని తెలిపారు. తెలంగాణకు నీటి కేటాయింపు పెంపు కోసం గతంలో అవకాశం వచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.</p> <p><iframe style="border: none; overflow: hidden;" src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FABPDesam%2Fposts%2Fpfbid034Y2LToHpnr4qAgabFR3YgjUA4uWnsnv5RXEk9kWF8PJRNjgNdKW6KR1ncQvRJQMil&amp;show_text=true&amp;width=500" width="500" height="711" frameborder="0" scrolling="no" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>చంద్రబాబు వస్తాడో.. జగన్ వస్తాడో.. లేక మోదీ దిగుతాడో..</strong><br />నీటి పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డికి తరలించి తీరుతాం అన్నారు. మాకు రావాల్సిన నీటిని అడ్డుకోవడానికి <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a> వస్తాడో, చంద్రబాబు వస్తాడో, లేక ప్రధాని మోదీనే దిగుతాడో.. నేనూ చూస్తా అంటూ అసెంబ్లీ సాక్షిగా <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.&nbsp;</p>
Read Entire Article