Telangana Cabinet: మరోసారి ఢిల్లీకి రేవంత్ - ఈ సారి కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఖాయమే !?

11 months ago 7
ARTICLE AD
<p>CM Revanth Reddy:&nbsp; &nbsp;&nbsp;సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ మకాం వేయనున్నారు. రాజస్థాన్ లో ఓ వివాహవేడుకకు హజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన &nbsp;సీఎం. రేపు, ఎళ్లుండి &nbsp;అక్కడే ఉండి &nbsp;క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశాలున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం &nbsp;నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే కొత్త క్యాబినెట్ కొలువు తీరవచ్చన్న చర్చ సాగుతోంది. &nbsp;ఇప్పటికే క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు ఎవరికి &nbsp;దక్కనున్నాయో ఆ అంశాలపై పూర్తి క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని గాంధీ భవన్ లోని సీనియర్ కాంగ్రెస్ మెన్ చెబుతున్నారు.&nbsp;</p> <p><strong>మంత్రి వర్గ విస్తరణకు వేళయిందా..?</strong></p> <p>కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి &nbsp;ఏడాది కావోస్తోంది. &nbsp;2023 డిసెంబర్ &nbsp;7 న &nbsp;రేవంత్ సీఎంగా మరో 11 మంది మంత్రులతో రేవంత్ సర్కార్ &nbsp;నడుస్తోంది. &nbsp;శాసన సభ లో సభ్యుల సంఖ్యను బట్టి క్యాబినెట్ లో మరో ఆరుగురికి &nbsp;మంత్రి పదవుల ఇవ్వాల్సి ఉంది. &nbsp;కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కాని వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో &nbsp;మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత &nbsp;శావ్రణ మాసం కావడంతో మంచి రోజులు లేవని &nbsp;అప్పుడు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారు. &nbsp;ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ఇదే &nbsp;విషయమై &nbsp;హై కమాండ్ తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయే తప్ప &nbsp; ఈ దిశగా చర్చే జరగలేదని ఢిల్లీ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డే ప్రకటించిన &nbsp;సంగతి తెలిసిందే. అయితే ఏడాది పాటు హోం మంత్రి వంటి కీలక శాఖలకు మంత్రి లేకుండానే కాంగ్రెస్ &nbsp;ప్రభుత్వం పాలన సాగిస్తోంది. &nbsp; ఐదేళ్ల కాలపరిమితిలో ఇప్పటికే ఒక ఏడాది పూర్తయింది. మరో నాలుగేళ్లు మాత్రమే &nbsp;అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగనున్న నేపధ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. &nbsp;అయితే &nbsp;ఏడాది పాలన పూర్తి కావడం, &nbsp;డిసెంబర్ 9వ తేదీ వరకు పాలన విజయోత్సవాలు, &nbsp;తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తెలంగాణ జాతీయ గీతం ఆమోదం వంటి &nbsp;కీలక &nbsp;అంశాలు పూర్తి కావడంతో ఇక &nbsp;మంత్రి వర్గ విస్తరణ &nbsp;ఉండనుందన్న వార్తలు గాంధీ భవన్ లో చక్కర్లు కొడుతున్నాయి. &nbsp;ఈ దిశగా ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. &nbsp;రేవంత్ సహా హైకమాండ్ ముఖ్య నేతలను కాకా పట్టే పనిలో ఉన్నారు.&nbsp;</p> <p><strong>&nbsp;ఆరుగురు అమాత్యులు &nbsp;ఎవరు..?</strong></p> <p>రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా ఉమ్మడి జిల్లాల వారీగా &nbsp;చూస్తే, &nbsp;ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఉప ముఖ్యమంత్రి గా సీనియర్ నేత &nbsp;మల్లు భట్టి విక్రమార్క , మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులకు అవకాశం దక్కింది. నల్గొండ నుండి &nbsp;కొమటి రెడ్డి వెకంటరెడ్డి, &nbsp;ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. &nbsp;కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా నుండి &nbsp; సీతక్క, &nbsp;కొండా సురేఖ, &nbsp;మహబూబ్ నగర్ జిల్లా నుండి &nbsp;జూపల్లి కృష్ణారావు, &nbsp;మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహలు &nbsp;ఉన్నారు. &nbsp;ఆదిలాబాద్, &nbsp;నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ &nbsp;జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. &nbsp;ఇప్పుడు ఈ జిల్లా సమీకరణాలను బట్టి మంత్రి వర్గం ఎలా ఉండనుందన్న చర్చ సాగుతోంది. ఆరు క్యాబినెట్ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. &nbsp; ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, &nbsp;గడ్డం వినోద్, గడ్డం వివేక్ ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది. &nbsp;ఇక నిజామాబాద్ నుంచి పి. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు లు పోటీ పడుతున్నారు. అయితే సీనియర్ లీడర్ సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. &nbsp;హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలనుండి ఎవర్ని &nbsp;ఎంపిక చేస్తారన్న చర్చ సాగుతోంది. &nbsp;రంగారెడ్డి జిల్లాలో &nbsp; మలా రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ నుండి &nbsp;ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే &nbsp;మాత్రమే ఉపఎన్నికలో కంటోన్మెంట్ నుండి గెలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా కోటాలో<br />అయితే మల్ రెడ్డి రంగారెడ్డి, &nbsp;హైదరాగా బాద్ నుండి పార్టీ మారిన దానం నాగేందర్, &nbsp;హైదరాబాద్ నుండి &nbsp;మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్, అజారుద్ధీన్ లు పోటీ పడతున్నారు. అయితే ఇదే మైనార్టీ కోటా నుండి మా జీ మంత్రి షబ్బీర్ అలీ కూడా మంత్రి పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరిలో ఎవరికి &nbsp;అవకాశం దక్కునందా అన్న &nbsp;ఉత్కంఠ <a title="తెలంగాణ కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Telangana-Congress" data-type="interlinkingkeywords">తెలంగాణ కాంగ్రెస్</a> పార్టీలో నెలకొంది. అయితే మహబుబ్ నగర్ నుండి &nbsp;ఇప్పటికే జూపల్లి కృష్ణారావు క్యాబినెట్ లో ఉండగా మక్తల్ నుండి ఎన్నికయిన వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముదిరాజ్ లకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హమీ మేరకు శ్రీహరికి &nbsp;అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. &nbsp;నల్గొండ జిల్లా నుండి ఇద్దరు మంత్రులు &nbsp;ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉండగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోమటి రెడ్డి రాజ్ గోపాల్ అదిష్టానాన్ని కోరుతున్నారు. అయితే &nbsp; ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ &nbsp;ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. అదే జిల్లా నుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాలు నాయక్, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. &nbsp;</p> <p><strong>ఢిల్లీలో హైకమాండ్ ఏం చేస్తుందో...?</strong></p> <p>మంత్రి వర్గ విస్తరణపై &nbsp;సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే &nbsp;హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలువురు తెలంగాణ సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పైరవీలు చేస్తోన్న నేపధ్యంలో సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> ఇచ్చిన జాబితాను &nbsp;హైకమాండ్ &nbsp;ఓకే చెప్తుందా లేదా &nbsp;ఒకరిద్దరిని మారుస్తూ కొత్త జాబితా ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. &nbsp;అదే రీతిలో పార్టీ మారిన దానం, వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు &nbsp;తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నైపధ్యంలో బీఆర్ఎస్ వీడి పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి కట్టబెడతారా లేదా అన్నది చూడాలి. &nbsp;అంతే కాకుండా &nbsp;జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో &nbsp;బీఆర్ఎస్ నుండి &nbsp;మాజీ మంత్రులను &nbsp;పార్టీలో చేర్చుకుని <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> ను బలోపేతం చేయాలని , అలా చేరిన మాజీలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. అయితే ఇందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతే కాకుండా ఆరు మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేక &nbsp;ఒకటి రెండు మంత్రి పదవులను భర్తీ చేయకుండా అట్టిపెట్టి &nbsp;ఉంచుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. &nbsp;ఇప్పటికే పార్టీలో సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మంత్రి పదవులు దక్కని వారు పార్టీ లైన్ దాటి పని చేయకూడదంటే అలా &nbsp;ఒకటి రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచడం ద్వారా వారిని అదుపుచేయవచ్చ అన్న ఆలోచనలోను హైకమాండ్ ఉండవచ్చని గాంధీ భవన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతే కాకుండా ఆపరేషన్ ఆకర్ష్ &nbsp;చేపట్టాలంటే బీఆర్ఎస్ నుండి వచ్చే సీనియర్లకు ఆ మంత్రి పదవులను గాలం వేసి లాగవచ్చన్న వ్యూహం కూడా ఉంటుందని చెబుతున్నారు. &nbsp;అయితే ఈ వారంలో &nbsp;ఈ సస్పెన్స్ కు ఇక తెరపడుతుందని చెబుతున్నారు. &nbsp;ఏది ఏమైనా ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం కొత్త క్యాబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని, మంత్రులతో పాటు పాత మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉందని &nbsp;హస్తం నేతలు చెబుతున్నారు.&nbsp;</p>
Read Entire Article