TDP Leaders Suspension: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ వేటు

2 months ago 3
ARTICLE AD
<p>అమరావతి: కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. దాసరిపల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు. వారిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.</p> <p><strong>అసలేం జరిగిందంటే..</strong></p> <p>అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులు కల్తీ మద్యం తయారుచేస్తున్న ఈ &nbsp;కుటీర పరిశ్రమను సీజ్ చేశారు. అక్కడ జరిగిన తనిఖీల్లో రూ. కోటికి పైగా విలువైన నకిలీ మద్యం, తయారీకి ఉపయోగపడే యంత్రాలు, సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా 9 మందిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.&nbsp; &nbsp;</p> <p>గత కొన్ని నెలలుగా ఈ డంప్ రహస్యంగా నడుస్తోంది. టీడీపీ నేతలు స్థానికంగా రా మెటీరియల్స్&zwnj;ను సేకరించుకుని, ఆధునిక యంత్రాలతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఆ మద్యాన్ని కదిరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలకు దర్జాగా సరఫరా చేస్తున్నారు. ఈ మద్యం తక్కువ ధరకు విక్రయించడం వల్ల భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. కానీ కల్తీ మద్యం సేవించడంతో స్థానికుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు గుర్తించి సీజ్ చేసిన ఈ డంప్&zwnj;లో 500 లీటర్లకు పైగా కల్తీ మద్యం, మిక్సింగ్ మెషీన్లు, బాటిలింగ్ యూనిట్లు, కెమికల్స్ వంటి ముడి సరుకును సీజ్ చేశారు.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>
Read Entire Article