<p style="text-align: justify;"><strong>Asia Cup 2025: </strong>ఆసియా కప్ 2025 ఫైనల్స్‌కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఫిర్యాదుతో ICC ఈ ప్రక్రియను ప్రారంభించింది. వాస్తవానికి, సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌పై సాధించిన విజయం తర్వాత, సూర్యకుమార్ మ్యాచ్‌ని ఆపరేషన్ సింధూర్‌లో సాహనాన్ని ప్రదర్శించిన భారత సాయుధ దళాలు, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం చేశాడు. దీనిపై PCB "రాజకీయ ప్రకటన" అని అభ్యంతరం వ్యక్తం చేసింది.</p>
<h3>మ్యాచ్ రిఫరీ ఏం నిర్ణయించారు?</h3>
<p>మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ మొత్తం కేసు విచారణ తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రకటనపై అధికారిక హెచ్చరిక జారీ చేశారు. భారత కెప్టెన్‌తోపాటు ఈ విచారణలో BCCI COO హేమంత్ అమీన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సుమిత్ మల్లాపూర్‌కర్ కూడా పాల్గొన్నారు. రిచర్డ్‌సన్ BCCIకి ఒక ఇమెయిల్ పంపి, సూర్యకుమార్ చేసిన ప్రకటన ఆట ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని, అయితే ఇది తీవ్రమైన నేరం కిందకు రాదని రాశారు.</p>
<h3>ఎంత శిక్ష ఉంటుంది?</h3>
<p>ICC నిబంధనల ప్రకారం, ఈ కేసు లెవెల్-1 ఉల్లంఘనగా పరిగిణిస్తారు. లెవెల్‌ను ఉల్లంఘించినందుకు ఏ ఆటగాడిపైనా నిషేధం విధించే అవకాశం లేదు. అయితే, ఆటగాడిపై మ్యాచ్ ఫీజు లేదా డీమెరిట్ పాయింట్లు విధించవచ్చు. శుభవార్త ఏమిటంటే, ఈ చర్య సూర్యకుమార్ ఫైనల్‌లో ఆడే అవకాశాలపై ఎటువంటి ప్రభావం చూపదు.</p>
<h3>ఫైనల్‌లో కెప్టెన్ సూర్య బరిలోకి దిగుతారు</h3>
<p>భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్ మరోసారి పాకిస్తాన్‌తో తలపడనుంది. టీమ్ ఇండియాకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్‌లో అందుబాటులో ఉంటారు.</p>
<h3>భారత్‌కు ఊరట</h3>
<p>భారత్ మొత్తం టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఈ వివాదం కారణంగా ఫైనల్స్‌కు ముందు జట్టు దృష్టి మరలే ప్రమాదం ఉందని భావించినందున BCCI కూడా ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు సూర్య ఎటువంటి ఆటంకం లేకుండా మైదానంలోకి దిగుతాడు. టీమ్ ఇండియా టైటిల్ గెలవడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది.</p>