South Central Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ రూట్‌లలో కొత్త సర్వీస్‌లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే  

11 months ago 9
ARTICLE AD
<p><strong>South Central Railway Latest News:</strong> రైల్వే ప్రయాణికులకు గుడ్&zwnj; న్యూస్ చెప్పింది రైల్వేశాఖ. ఇప్పటి వరకు తిరుగుతున్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్&zwnj;గా మార్చేయనుంది. వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచే రైళ్లను రోజూ నడిపించనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. కాబట్టి ఆయా మార్గాల్లో నడిచే ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఛార్జీల మోత కూడా తప్పనుంది.&nbsp;</p> <p><strong>ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ట్రైన్స్</strong></p> <p>పండగులు, ప్రత్యేక సందర్భాల్లో రైల్వే శాఖ ఈ ప్రత్యేక ట్రైన్స్&zwnj; నడుపుతుంది. రద్దీ తగ్గిన వెంటనే వాటిని రద్దు చేస్తుంది. ఈ ట్రైన్స్&zwnj;లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తుంది. వీటి టైమింగ్స్&zwnj; కూడా వేరుగా ఉంటాయి. &nbsp;అలా నడిపే స్పెషల్ ట్రైన్స్&zwnj;లో కొన్నింటినీ సాధారణ రైళ్లు మాదిరిగా రెగ్యులర్&zwnj;గా నడపాలని చూస్తోంది. &nbsp;</p> <p><strong>కరోనా తర్వాత సర్వీసుల్లో మార్పులు&nbsp;</strong></p> <p>కరోనా తర్వాత రైల్వే శాఖలో చాలా మార్పులు వచ్చాయి. చాలా వరకు రైల్&zwnj; సర్వీలను నిలిపేశారు. మరికొన్నింటి బొగీలు తగ్గించారు. వందే భారత్ ట్రైన్స్&zwnj; పట్టాలెక్కించారు. ఇలా చేసిన మార్పులు కారణంగా ప్రయాణికులు కొంత సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నారు. కానీ సమస్యలను కూడా చాలానే ఎదుర్కొంటున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న రైల్వే శాఖ మార్పులు చేర్పులు చేస్తోంది.&nbsp;</p> <p>అలాంటి మార్పులు చేర్పుల్లో ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్&zwnj;ను రెగ్యులర్ ట్రైన్స్&zwnj;గా మార్చనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్&zwnj;, కాజిగూడ, నాంపల్లి నుంచి చాలా వరకు స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే శబరిమల వెళ్లే భక్తుల కోసం కొన్ని నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా సర్వీస్&zwnj;లు రన్ చేయనున్నారు. ప్రస్తుతం శబరిమల వెళ్లే యాత్రికుల కోసం 30కిపైగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.&nbsp;</p> <p><strong>Also Read: <a title="విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్&zwnj;లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం" href="https://telugu.abplive.com/andhra-pradesh/vijayawada/dpr-of-vijayawada-and-visakhapatnam-metro-rail-phase-1-approved-by-ap-government-189191" target="_blank" rel="noopener">విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్&zwnj;లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం</a></strong></p> <p><strong>వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటే...</strong></p> <p>వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అవసరాల కోసం వేసే ఈ స్పెషల్ సర్వీస్&zwnj;లను రెగ్యులర్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్&zwnj; చూసేందుకు రోజూ బారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ ట్రైన్స్&zwnj;లో వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని భావిస్తోంది.&nbsp;</p> <p>ఇప్పటి వరకు శబరిమలకు హైదరాబాద్&zwnj; నుంచి ఒకటే ట్రైన్ నడుస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రైలు వేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు నడుస్తున్న స్పెషల్ ట్రైన్&zwnj;లో వంద శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైలును రెగ్యులరైజ్ చేస్తారు. &nbsp;షిరిడీ వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అక్కడికి కూడా మరో రెగ్యులర్ ట్రైన్ నడపాలని చూస్తున్నారు.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/lifestyle/best-train-routes-in-india-and-the-best-time-to-visit-164965" width="631" height="381" scrolling="no"></iframe></p> <p><strong>తిరుపతి వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్</strong></p> <p>తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వెళ్లే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల ప్రజలు ఉంటున్న హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరస్వామి భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే మరో ట్రైన్&zwnj;ను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నారు. ఇప్పటి వరకు తిరుగుతున్న స్పెషల్ ట్రైన్&zwnj;ను సెవెన్&zwnj;హిల్స్&zwnj; ఎక్స్&zwnj;ప్రెస్&zwnj;గా పేరు పెట్టి రెగ్యులర్&zwnj;గా తిప్పుతారు.&nbsp;</p> <p>ఈ ప్రాంతాలతోపాటు కాకినాడ. విజయవాడ, విశాఖ సహా ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ వెళ్లే వాళ్ల కోసం మరికొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పెషల్&zwnj;గా నడిపినప్పుడు కాకుండా మిగిలినటైంలో కూడా రద్దీ కలిగి ఉన్న ట్రైన్స్&zwnj;ను రెగ్యులర్ చేయనున్నారు అధికారులు. ఇలా తీసుకురానున్న రెగ్యులర్ ట్రైన్స్&zwnj;తోపాటు మరికొన్ని ట్రైన్స్ టైమింగ్స్ మార్చనున్నారు. అందుకే జనవరి నుంచి రైల్వే టైం టేబుల్&zwnj;లో మార్పులు కనిపిస్తాయి. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. &nbsp;</p> <p><strong>Also Read: <a title="శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!" href="https://telugu.abplive.com/andhra-pradesh/south-central-railway-additional-special-trains-to-sabarimala-from-telugu-states-189856" target="_blank" rel="noopener">శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!</a></strong></p>
Read Entire Article