Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!

6 days ago 2
ARTICLE AD
<p><strong>National Highway Tender Rigging Andhra Pradesh:</strong> శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ టెండర్ల చుట్టూ అలుముకున్న అవినీతి నీడలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. &nbsp;NH-42, NH-340 &nbsp;రహదారులతో పాటు పలు ఆర్&zwnj;ఓబీ ల నిర్వహణ కోసం కేటాయించిన రూ. 10.69 కోట్ల షార్ట్ టర్మ్ మెయింటెనెన్స్ &nbsp;టెండర్లలో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో కొన్ని నిర్మాణ సంస్థలు కుమ్మక్కై, అర్హత గల కాంట్రాక్టర్లను ఉద్దేశపూర్వకంగా తప్పించడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాను లూటీ చేసేందుకు పక్కా స్కెచ్ వేశాయన్నది ఈ వివాదంలోని ప్రధానాంశం.&nbsp;</p> <p><strong>పారదర్శకత లేని టెండర్లు</strong><br />&nbsp;<br />శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ ప్రక్రియ పారదర్శకతకు పాతర వేస్తూ సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ పనుల కోసం టెండర్లు ఆహ్వానించిన తరుణంలో, క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక 'రింగ్'గా ఏర్పడ్డారు. తాము అనుకున్న సంస్థలకే ఈ టెండర్లు దక్కేలా, నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇతర సంస్థలను 'టెక్నికల్ గ్రౌండ్స్' పేరుతో అనర్హులుగా ప్రకటించి, పోటీ లేకుండా ఏకపక్షంగా టెండర్లను ముగించేందుకు యత్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.&nbsp;</p> <p><strong>టెక్నికల్ గ్రౌండ్స్ పేరుతో పలు సంస్థలపై అనర్హత</strong></p> <p>ఈ మొత్తం వ్యవహారంలో &nbsp;సూపరింటెండింగ్ ఇంజనీర్ &nbsp;పాత్రపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, టెండర్ అంచనాలను కృత్రిమంగా పెంచి చూపడం ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రోడ్డు నిర్వహణకు అయ్యే ఖర్చు కంటే అంచనాలను &nbsp; రెట్టింపు చేసి చూపించడం వెనుక పెద్ద ఎత్తున కమీషన్ల పంపిణీ జరిగిందనే సమాచారం వెలుగులోకి వచ్చింది. కొంతమంది నిజాయితీ గల కాంట్రాక్టర్లు బిడ్డింగ్&zwnj;లో పాల్గొనకుండా అడ్డుకోవడం ఈ రిగ్గింగ్&zwnj;లో కీలక ఘట్టమని తెలుస్తోంది.&nbsp;</p> <p><strong>కాగితాలపైనే పనులు చూపించి నిధులు కొట్టేసే ప్రయత్నం</strong></p> <p>కేవలం కాగితాల మీద మాత్రమే పనులు చూపించి, క్షేత్రస్థాయిలో అరకొర పనులతో బిల్లులు డ్రా చేసేలా ఈ టెండర్ల రూపకల్పన జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రోడ్ల నిర్వహణ పేరుతో అత్యవసరంగా నిధులు మంజూరు చేయించుకుని, ఆ తర్వాత నాణ్యత లేని పనులతో సరిపెట్టేందుకు ఈ నెట్&zwnj;వర్క్ సిద్ధమైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నుంచి టెక్నికల్ టీమ్ వరకు అందరూ ఏకమై ఈ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆందోళన నిరుద్యోగ కాంట్రాక్టర్లలో వ్యక్తమవుతోంది. ఇది ప్రజాధనాన్ని నిలువునా దోచుకోవడమేనని స్థానిక నేతలు మండిపడుతున్నారు.&nbsp;</p> <p><strong>గడ్కరీకి ఆధారాలతో సహా ఫిర్యాదులు&nbsp;</strong></p> <p>ఈ అక్రమాలపై ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రి &nbsp;నితిన్ గడ్కరీ కి , &nbsp;ఆ శాఖ కార్యదర్శికి &nbsp;<a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> సీనియర్ నేత విష్ణువర్ధ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. &nbsp; అత్యంత విలువైన ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే, కేంద్ర విజిలెన్స్ కమిషన్ &nbsp;రంగంలోకి దిగి లోతైన విచారణ జరపాలని డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టెండర్ల బిడ్డింగ్ ఓపెన్ చేయడానికి ముందే ఈ ప్రక్రియను నిలిపివేసి, ప్రతి అంచనాను మళ్లీ వెరిఫై చేయించాలని బాధితులు కోరుతున్నారు. అవినీతి అధికారుల బండారం బయటపడాలంటే టెక్నికల్ ఆడిట్ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.</p> <p>ప్రస్తుతం ఈ ఫైల్ ఢిల్లీలోని ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. ఒకవేళ విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే, సంబంధిత అధికారులపై వేటు పడటంతో పాటు టెండర్లను రద్దు చేసే అవకాశం ఉంది. జాతీయ రహదారుల నాణ్యతతో రాజీపడి, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ సాగుతున్న ఈ &nbsp;రిగ్గింగ్ &nbsp;మాఫియాపై కేంద్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వ్యవహారం శ్రీ సత్యసాయి జిల్లాలో రియల్ ఎస్టేట్, &nbsp;కాంట్రాక్టు రంగాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/cinema/sanya-malhotra-is-making-waves-in-a-two-piece-bikini-248703" width="631" height="381" scrolling="no"></iframe></p>
Read Entire Article