Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ

3 hours ago 1
ARTICLE AD
<p><strong>Rahul Gandhi Scuba Diving Nicobar:</strong> కేంద్ర ప్రభుత్వం అండమాన్ దీవుల్లో చేపట్టిన &nbsp;'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్' ఎంతటి విధ్వంసమో చెప్పేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త పంథాను &nbsp;ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జరిగే పర్యావరణ విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్రం లోపలి జీవావరణాన్ని చూపిస్తూ.. కేంద్రం ప్రాజెక్టుతో ఇదంతా పోతుందని చెప్పారు. కేంద్రం చేపట్టిన &nbsp;'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్' &nbsp; &nbsp;స్థానిక పర్యావరణాన్ని, గిరిజన ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని రాహుల్ &nbsp;మండిపడ్డారు.&nbsp;</p> <p><strong>ఇందిరా పాయింట్&zwnj;కు వెళ్లిన రాహుల్&nbsp;</strong></p> <p>రాహుల్&zwnj;గాంధీ ఇండియా సదరన్&zwnj; టిప్ ఇందిరా పాయింట్&zwnj;ను కొన్ని రోజుల కిందట సందర్శించారు. అండమాన్ దీవుల్లో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లిన రాహుల్.. కేంద్రం అక్కడ చేపడుతున్న &nbsp;'గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్'కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ ప్రారంభించారు. స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజన తెగలు, మాజీ సైనికుల కుటుంబాలతో మాట్లాడారు. &nbsp;<br />ఈ ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు.&nbsp;</p> <p><strong>అండమాన్ సముద్రంలో స్కూబా డైవింగ్&nbsp;</strong></p> <p>కేంద్రం తీసుకొస్తున్న ప్రాజెక్టుతో భూమిపైనే కాకుండా సముద్రంలోపల కూడా జీవ సమతుల్యత దెబ్బతింటుందని ఆరోపించారు. అండమాన్ అద్భుతమైన &nbsp;పగడపు దిబ్బల (coral reefs)ను కలిగి ఉందని .. ఈ ప్రాజెక్టుతో వాటి విధ్వంసం జరుగుతుందని చెప్పారు. పగడపు దిబ్బల &nbsp;అందాలను చూపించేందుకు.. వాటికి పొంచి ఉన్న ముప్పును స్వయంగా చూసేందుకు రాహుల్ గాంధీ సముద్రంలోకి స్కూబా డైవింగ్ చేశారు. నీటి అడుగున ఉన్న అద్భుతమైన పర్యావరణాన్ని చూపిస్తూనే, ఈ ప్రాజెక్టు వల్ల జరగబోయే నష్టాన్ని వివరిస్తూ ఆయన ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'X' లో పంచుకున్నారు.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/BLDgxBRD1EU?si=dC0vaar1BBT8WQL5" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>కేంద్రం దుశ్చర్య- పగడపు దీవులు మాయం</strong></p> <p>ఈ ప్రాజెక్టును ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చాలా దూకుడుగా ఉందని రాహుల్ ఆరోపించారు. &nbsp;ప్రాజెక్టుకు అనుమతులు సాధించడం కోసం పర్యావరణ పరంగా అత్యంత కీలకమైన పగడపు దిబ్బలను అధికారిక మ్యాపుల నుంచి కావాలనే తొలగించారని రాహుల్ సంచలన ఆరోపణ చేశారు.</p> <p><strong>కార్పోరేట్ ప్రయోజనాల కోసమే</strong><br />&nbsp;<br />కేంద్ర ప్రభుత్వం స్థానిక పర్యావరణాన్ని, అక్కడి ప్రజల హక్కులను పక్కనపెట్టి కేవలం వ్యాపార, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ఈ మెగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.అటవీ హక్కుల చట్టాన్ని (Forest Rights Act) పూర్తిగా ఉల్లంఘిస్తూ అక్కడి గిరిజన తెగల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.<br />ప్రభుత్వం ఇక్కడ పునరావాసం కల్పించిన మాజీ సైనికుల కుటుంబాలకు (Settlers) నేటికీ సరైన నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 1.5 కోట్ల చెట్లను నరికివేయబోతున్నారని, ఇది ఊహించని పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించారు.</p> <p><strong>రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇస్తే 'ఐఎన్&zwnj;ఎస్ బాజ్'ను విస్తరించండి!</strong></p> <p>ఈ ప్రాజెక్టును వ్యూహాత్మక, రక్షణ రక్షణ అవసరాల (Strategic and Defence Initiative) కోసమే చేపడుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను రాహుల్ గాంధీ పూర్తిగా తిప్పికొట్టారు.<br />"నిజంగా దేశ భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న భారత నావికాదళ ఎయిర్ స్టేషన్ 'ఐఎన్&zwnj;ఎస్ బాజ్' (INS Baaz) ను విస్తరించాలి. ఐఎన్&zwnj;ఎస్ బాజ్ విస్తరణ కోసం గత ఐదేళ్లుగా నౌకాదళం కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఆ పని చేస్తే మేము పూర్తి మద్దతు ఇస్తాం." అని చెప్పారు.&nbsp;<br />అలాగే అంతర్జాతీయ రవాణా నౌకాశ్రయం (Transhipment Port) కోసమే ఈ ప్రాజెక్ట్ కడుతున్నామనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇప్పటికే కేరళలో ఇటువంటి భారీ అంతర్జాతీయ పోర్ట్ అభివృద్ధి చెందుతోందని, కాబట్టి నికోబార్&zwnj;లో పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.</p> <p><strong>అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు</strong></p> <p>అభివృద్ధికి తానెప్పుడూ వ్యతిరేకం కాదని రాహుల్ స్పష్టం చేశారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసే అభివృద్ధి అవసరం లేదన్నారు. "నేను ఎల్లప్పుడూ పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధికి (Ecologically balanced development) కట్టుబడి ఉంటాను. ఈ దీవులను ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సుస్థిర పర్యాటక కేంద్రంగా (Sustainable Tourism Destination) మార్చవచ్చు. అటువంటి భారతదేశం కోసమే మనం పోరాడాలి" అని <a title="రాహుల్ గాంధీ" href="https://telugu.abplive.com/topic/Rahul-Gandhi" data-type="interlinkingkeywords">రాహుల్ గాంధీ</a> పిలుపునిచ్చారు.&nbsp;</p> <p>అండమాన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాహుల్ Green Over Greed &nbsp;క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.&nbsp;</p>
Read Entire Article