<p><strong>Russia India trade ties expansion : </strong>భారత్ , రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధాన మంత్రి <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a>, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా సమ్మిట్‌లో పాల్గొన్నారు. 2030 వరకు ఆర్థిక సహకార ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమ్మిట్ 25 సంవత్సరాల క్రితం పుతిన్ భాగస్వామ్యానికి పునాది వేసిన సందర్భంలో జరిగింది. ఉమ్మడి మీడియా సమావేశంలో మోదీ, ఈ స్నేహాన్ని మారుతున్న ప్రపంచంలో " నార్త్ స్టార్‌" గా పేర్కొన్నారు. ఆర్థిక సహకారం, ఇంధన భద్రత, ఉగ్రవాద నిర్మూలన, టూరిజం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. <br /> <br />ఈ సమ్మిట్ భారత్-రష్యా సంబంధాల చరిత్రలో మరో ముఖ్య అధ్యాయం. గత 80 సంవత్సరాలలో ప్రపంచం ఎన్నో ఆందోళనలు ఎదుర్కొన్నప్పటికీ, రెండు దేశాల మధ్య స్నేహం పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి స్థిరంగా ఉందని జాయింట్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యవస్థలు మారుతున్నా, ఈ భాగస్వామ్యం మార్గదర్శకంగా ఉందని మోదీ అన్నారు. సమ్మిట్‌లో ఆర్థిక, రక్షణ, శక్తి, సాంస్కృతిక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. </p>
<p>భారత్-రష్యా దేశాలు 2030 వరకు బహుముఖ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళిక రూపొందించాయి. గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్యం 12% వృద్ధి చెంది, కొత్త రికార్డు స్థాపించింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలు వారి వారి దేశాల కరెన్సీలలో చెల్లింపులు చేయనున్నారు. డాలర్‌కు చెక్ పెట్టనున్నారు. భారత్ శక్తి అవసరాలకు రష్యా నుంచి స్థిరమైన ఆయిల్, గ్యాస్, కోల్ సరఫరా. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో దశాబ్దాల సహకారం క్లీన్ ఎనర్జీకి దోహదపడుతోంది. క్రిటికల్ మినరల్స్ విషయంలో సహకారం కొనసాగుతుంది. ఈ ప్రణాళిక రెండు దేశాల ఆర్థిక వృద్ధికి, ప్రపంచ శక్తి భద్రతకు బలమైన పునాది వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. <br /> <br /><strong>పుతిన్ నా ఫ్రెండ్ : మోదీ</strong></p>
<p> ప్రెసిడెంట్ పుతిన్ తన స్నేహితుడని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం గత ఎనిమిది దశాబ్దాలలో ఎన్నో ఆందోళనలు చూసింది. అయితే, భారత్ మరియు రష్యా మధ్య స్నేహం ఉత్తర తారలా ఉంది. ఈ సంబంధం పరస్పర గౌరవం , విశ్వాసంపై ఆధారపడి ఉంది... ఈ రోజు మనం ఈ సంబంధాన్ని బలోపేతం చేయడానికి అన్ని అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. <br />శక్తి భద్రత మన భాగస్వామ్యంలో బలమైన స్తంభం, మనం ఈ విన్-విన్ సహకారాన్ని కొనసాగిస్తాము. మన సివిల్ న్యూక్లియర్ ఎనర్జీలో దశాబ్దాల సహకారం క్లీన్ ఎనర్జీకి దోహదపడింది. క్రిటికల్ మినరల్స్‌లో మన సహకారం ప్రపంచ సరఫరా గొలుసును విభిన్నంగా మరియు నమ్మకంగా ఉంచడానికి అవసరం అని పేర్కొన్నారు. </p>
<p><strong>భారత్ కు అవసరమైన ఇంధనాలు అందిస్తాము : పుతిన్ </strong></p>
<p> వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం ఇంధనాల అంతరాయం లేని సరఫరాను కొనసాగిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. గత సంవత్సరం మన ద్వైపాక్షిక వాణిజ్య ఆవిర్భావం 12 శాతం వృద్ధి చెందింది, కొత్త రికార్డు స్థాపించింది. మేము ఈ సంవత్సరం వాణిజ్య ఒప్పందం అదే ఆకర్షణీయ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ప్రధాన మంత్రి మన రెండు ప్రభుత్వాలకు ప్రయోజనమైన అంశాలపై జాబితా ఇచ్చారని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. మన దేశాలు జాతీయ కరెన్సీలలో పరస్పర సెటిల్‌మెంట్లకు క్రమంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు పోరాడుతాయన్నారు. <br /> <br />రష్యా నుంచి భారత్‌కు ఇంధనాల స్థిరమైన సరఫరా, రక్షణ సహకారం, సాంస్కృతిక బంధాలు ఈ సంబంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. పుతిన్ పర్యటనలో చేసుకున్న ఈ ఒప్పందాలు భారత్ ఆర్థిక వృద్ధికి, రష్యా ఎక్స్‌పోర్ట్‌లకు ఊరట ఇస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. </p>
<p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/business/gratuity-even-after-working-for-a-year-here-are-the-new-calculations-229628" width="631" height="381" scrolling="no"></iframe></p>