Rohit Sharma Padma Shri Award: రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లను వరించిన పద్మశ్రీ పురస్కారం

2 months ago 9
ARTICLE AD
<p>Padma Awards 2026: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 131 మంది పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. వారి సంబంధిత రంగాలలో అసాధారణమైన ప్రతిభ, సేవలు అందించిన&nbsp; మొత్తం తొమ్మిది మంది క్రీడాకారులను పద్మ అవార్డులు ప్రకటించి గౌరవించారు. 5 మందికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలను పద్మశ్రీ వరించింది.</p> <p><strong>రోహిత్ శర్మ:</strong> మాజీ భారత కెప్టెన్, 2024 T20 ప్రపంచ కప్ విజేత రోహిత్ శర్మకు పద్మశ్రీ ప్రకటించారు. గత దశాబ్దంలో భారతదేశం చిన్న ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయించడానికి రోహిత్ కెప్టెన్సీ, విధ్వంసకర బ్యాటింగ్ చాలా కీలకంగా ఉన్నాయి.</p> <p><strong>హర్మన్&zwnj;ప్రీత్ కౌర్:</strong> భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పద్మశ్రీకి ఎంపికయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ 2025లో భారతదేశానికి తొలిసారిగా మహిళల ప్రపంచ కప్ టైటిల్&zwnj;ను అందించడం ద్వారా చరిత్ర సృష్టించారు.</p> <p><strong>విజయ్ అమృత్&zwnj;రాజ్&zwnj;కు పద్మ భూషణ్</strong></p> <p>టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్&zwnj;రాజ్ 2026లో పద్మ భూషణ్ అందుకున్న ఏకైక క్రీడాకారుడిగా నిలిచారు. భారత టెన్నిస్&zwnj;లో అతని అసమానమైన వారసత్వం, గ్లోబల్ స్పోర్ట్స్ అంబాసిడర్&zwnj;గా కొనసాగుతున్న ప్రభావాన్ని ఈ గుర్తింపు హైలైట్ చేస్తుంది.</p> <p><strong>అవార్డు పొందిన క్రీడాకారుల జాబితా&nbsp;</strong></p> <p>పద్మ భూషణ్: విజయ్ అమృత్&zwnj;రాజ్ - టెన్నిస్</p> <p>పద్మశ్రీ: రోహిత్ శర్మ - క్రికెట్</p> <p>పద్మశ్రీ: హర్మన్&zwnj;ప్రీత్ కౌర్ - క్రికెట్</p> <p>పద్మశ్రీ: ప్రవీణ్ కుమార్ - పారా-అథ్లెటిక్స్ (హై జంప్)</p> <p>పద్మశ్రీ: సవితా పునియా - హాకీ (గోల్&zwnj;కీపర్)</p> <p>పద్మశ్రీ: బల్దేవ్ సింగ్ - స్పోర్ట్స్ కోచింగ్ / అభివృద్ధి</p> <p>పద్మశ్రీ: భగవాన్&zwnj;దాస్ రైక్వార్ - క్రీడలకు సహకారం (గుర్తించబడని హీరో)</p> <p>పద్మశ్రీ: కె. పజనివేల్ - క్రీడాభివృద్ధి</p> <p>పద్మశ్రీ: వ్లాదిమిర్ మెస్ట్&zwnj;విరిష్విలి - రెజ్లింగ్ కోచింగ్</p> <p>&nbsp;భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. ఇది భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్&zwnj;ల తర్వాత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం. 1954లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టిన అవార్డులు ప్రతి సంవత్సరం పలు రంగాల్లో విశేష సేవ చేసిన వారికి ప్రకటించి కేంద్ర ప్రభుత్వం వారిని సత్కరిస్తుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్&zwnj;లో నిర్వహించే కార్యక్రమంలో పద్మ అవార్డు విజేతలు పురస్కారాలను అందుకుంటారు.</p> <h3>దీనిని ఎందుకు అందజేస్తారు?</h3> <p>పద్మ అవార్డుల ప్రధాన లక్ష్యం ఏదైనా రంగంలో విశిష్ట సేవను గుర్తించడం. వృత్తిపరమైన విజయాలపై మాత్రమే దృష్టి సారించే అనేక అవార్డుల మాదిరిగా కాకుండా, పద్మశ్రీకి ప్రజా సేవ, ఇతర రంగాల్లో సేవలను గుర్తించి కేంద్రం వారిని సత్కరిస్తుంది. గ్రహీత తన నైపుణ్యాన్ని సాధించడమే కాకుండా సమాజం లేదా దేశం అభివృద్ధికి కూడా దోహదపడేవారై ఉంటారు.</p>
Read Entire Article