Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా

2 weeks ago 3
ARTICLE AD
<p>భోపాల్: త్రివేండ్రం నుంచి హజరత్&zwnj; నిజాముద్దీన్&zwnj; వెళ్తున్న రాజధాని ఎక్స్&zwnj;ప్రెస్&zwnj; రైలులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్&zwnj;లోని రత్లాం జిల్లాలో &nbsp;రైలులోని ఒక ఏసీ కోచ్&zwnj;లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు కోచ్&zwnj;లో పొగలు, మంటలు రావడాన్ని గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.</p> <p>అయితే, రైలు గార్డ్ అత్యంత సమయస్ఫూర్తితో, అప్రమత్తతతో వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్&zwnj;పీఎఫ్ (RPF) సిబ్బంది రంగంలోకి దిగి, మంటలు వ్యాపించిన ఏసీ బోగీలో ఉన్న 68 మంది ప్రయాణికులను అత్యంత వేగంగా, సురక్షితంగా కిందకు దించేశారు. అనంతరం రైల్వే సిబ్బంది మంటలు అంటుకున్న ఆ బోగీని మిగతా రైలు నుంచి వేరు చేసి, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. గార్డ్, ఆర్&zwnj;పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ తీవ్రమైన అగ్నిప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/17/cfd53ed53a1cbfe61522b72242577cb41778999920181233_original.jpeg" /></p> <p><strong>కాశీ యాత్రలో ప్రమాదం.. శ్రీకాకుళం జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా..&nbsp;</strong><br />కంచిలి : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగం గ్రామ సమీప నేషనల్ హైవేపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కాశి తీర్థయాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్&zwnj;తో పాటు ట్రావెల్ ఏజెంట్&zwnj;కు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p> <p>కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమ్మిదినూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు పవిత్ర కాశీ యాత్రకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చెక్ చేశారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్&zwnj;కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>
Read Entire Article