<p><strong>Putin Visit to India:</strong>రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు భారతదేశంలో పర్యటించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4, 2025 రాత్రి 7LKM వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్‌ను డిన్నర్‌కు ఆహ్వానించారు. అంతకుముందు ఇద్దరు నేతలు విమానాశ్రయం నుంచి ఒక కారులో 7LKMకి చేరుకున్నారు. ప్రధాని నివాసంలో మోదీ, పుతిన్‌ మధ్య దాదాపు 2:30 గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, పుతిన్‌ పలు కీలక అంశాలపై ఒంటరిగా చర్చించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు.</p>
<p>దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సైబీరియాలోని టామ్స్క్ నగరంలో ఒక కేసు నమోదైంది, ఇది భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇస్కాన్ ప్రచురించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్” రష్యన్ అనువాదంపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తీవ్రవాద సాహిత్యం అని పిలవడానికి ప్రయత్నించారు. ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి, దీనిని రష్యా తీవ్రవాద పుస్తకాల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించింది.</p>
<blockquote class="twitter-tweet" data-media-max-width="560">
<p dir="ltr" lang="en">Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.<a href="https://twitter.com/KremlinRussia_E?ref_src=twsrc%5Etfw">@KremlinRussia_E</a> <a href="https://t.co/D2zczJXkU2">pic.twitter.com/D2zczJXkU2</a></p>
— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1996640866468090252?ref_src=twsrc%5Etfw">December 4, 2025</a></blockquote>
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
<h3>బహుమతిగా అదే భగవద్గీత, కానీ కథ పూర్తిగా మారింది</h3>
<p>ఇప్పుడు చరిత్ర మారింది. ప్రధాని మోదీ, పుతిన్‌ ఢిల్లీలో ముఖాముఖిగా కలిసినప్పుడు, ప్రధానమంత్రి <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> రష్యన్ భాషలోకి ట్రాన్స్‌లేట్ అయిన భగవద్గీతను బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతి కేవలం ఒక పుస్తకం కాదు. గతంలోని నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయని, రెండు దేశాలు మునుపటి కంటే బలమైన నమ్మకం పునాదిపై నిలబడ్డాయనే సందేశం ఇది. నేడు, భారతదేశం, రష్యా తమ సంబంధాన్ని కేవలం భాగస్వామ్యంగానే కాకుండా చారిత్రక స్నేహంగా చూస్తున్నాయి. ఆ స్నేహం సమయంలో గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథం ఉండటం ద్వారా రెండు దేశాలు గత వివాదాలను మాత్రమే కాకుండా వాటిని కొత్త ప్రారంభానికి ఆధారంగా కూడా చేసుకున్నాయని తెలుస్తుంది.</p>