Pithapuram News: పవన్ నియోజకవర్గంలో విషాదం; PHC సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆరోపణలు, వైద్య ఆరోగ్య శాఖపై తీవ్ర విమర్శలు!

2 days ago 1
ARTICLE AD
<p><strong>Pithapuram News:</strong> ఆంధ్రప్రదేశ్&zwnj; వైద్య ఆరోగ్య&zwnj;శాఖలో నిర్ల&zwnj;క్ష్యం ఆవ&zwnj;హిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఆసుప&zwnj;త్రి నిర్వ&zwnj;హ&zwnj;ణ ద&zwnj;గ్గ&zwnj;ర నుంచి పేషెంట్ల&zwnj;ను ప&zwnj;ట్టించుకోవ&zwnj;డం వ&zwnj;ర&zwnj;కు నిర్ల&zwnj;క్షంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. తునిలో పేషెంట్ కాలు సర్జరీ చేసి స&zwnj;ర్జిక&zwnj;ల్ బ్లేడు ఉంచి ఆప&zwnj;రేష&zwnj;న్ పూర్తి చేసిన ఘ&zwnj;ట&zwnj;న, ఇప్పుడు పిఠాపురంలో పీహెచ్&zwnj;సీ ఘటన ప్రజలు గుర్తు చేస్తున్నారు. &nbsp;ఏపీ డిప్యూటీ సీఎం ప&zwnj;వ&zwnj;న్ కల్యాణ్ ప్రాతినిధ్యం వ&zwnj;హిస్తోన్న పిఠాపురం నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గంలో ప్రాథమిక ఆరోగ్య&zwnj; కేంద్రం నిర్ల&zwnj;క్ష్యం వ&zwnj;ల్ల ఓ నిండిప్రాణం బ&zwnj;లైపోయిందని స్థానికులు చెబుతున్నారు. గుండెనొప్పితో ఆసుప&zwnj;త్రికి తీసుకువ&zwnj;చ్చిన వ&zwnj;స్తే ఆసుప&zwnj;త్రిలో ఎవ్వ&zwnj;రూ లేక తాళం వేసి ఉందని అంటున్నారు. ప్రాధ&zwnj;మిక చికిత్స అంద&zwnj;క ఆసుప&zwnj;త్రి ఆవ&zwnj;ర&zwnj;ణ&zwnj;లోనే ఆ వ్యక్తి కుప్ప&zwnj;కూలి మృతిచెందాడు. ఈ ఘ&zwnj;ట&zwnj;న పిఠాపురం నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గం చేబ్రోలులో చోటుచేసుకుంది.</p> <p>పిఠాపురం నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గం చేబ్రోలులో పీహెచ్&zwnj;సీలో వైద్యుల నిర్ల&zwnj;క్ష్యం వ&zwnj;ల్ల గ&zwnj;తంలో బాలింత మృతిచెందింది. ఈ పీహెచ్&zwnj;సీలోనే మంగ&zwnj;ళ&zwnj;వారం ఉద&zwnj;యం మ&zwnj;రో ఘ&zwnj;ట&zwnj;న చోటుచేసుకుంది. చేబ్రోలు పీహెచ్&zwnj;సీ వ&zwnj;ద్ద&zwnj;కు ఓ వ్య&zwnj;క్తి గుండె నొప్పి అని ఆసుప&zwnj;త్రికి వ&zwnj;స్తే తాళాలు వేసి ఉన్నాయి. 108కి ఫోన్ చేస్తే స&zwnj;కాలంలో రాలేదు. దీంతో అక్క&zwnj;డే కుప్ప&zwnj;కూలి మృత్యువాత ప&zwnj;డ్డాడు.&nbsp;</p> <h3>అస&zwnj;లేం జ&zwnj;రిగిందంటే..</h3> <p>కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ&zwnj;క&zwnj;వ&zwnj;ర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున గుండెపోటు బారిన ప&zwnj;డిన ఓ వ్య&zwnj;క్తిని ద&zwnj;గ్గ&zwnj;ర్&zwnj;లో ఉన్న చేబ్రోలు పీహెచ్&zwnj;సీకు తీసుకుని వ&zwnj;చ్చారు. పీహెచ్ సీలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108కు ఫోన్ చేశారు. అదికూడా స&zwnj;కాలంలో రాలేదు. దీంతో ఆసుప&zwnj;త్రి వ&zwnj;ద్ద ఆవ&zwnj;ర&zwnj;ణ&zwnj;లోనే ప్రాణాలు కోల్పోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;పై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ విచారణకు ఆదేశించారు.&nbsp;</p> <p>స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు గ్రామానికి చెందిన ఇమ్మంది మాణిక్యం (56) గొల్లప్రోలు శివారు ఈబిసి కాలనీలో గల ఒక హోటల్లో పనిచేస్తుంటాడు. భార్య పిల్లలు లేకపోవడంతో ఇతడు హోటల్లోనే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి మాణిక్యానికి గుండెపోటు రావడంతో హోటల్లో పనిచేసే వర్కర్లు చేబ్రోలు పి హెచ్ సి కి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడం, ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో 108కి ఫోన్ చేసారు. అంబులెన్స్ రావడానికి గంటకుపైగా సమయం పట్టడంతో మాణిక్యం నొప్పి భరించలేక ఆసుపత్రి ఆవరణంలోనే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడు.&nbsp;</p> <p>తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చేబ్రోలు ఆసుపత్రి వద్దకు చేరుకున్న108 సిబ్బంది రోగిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు ద&zwnj;క్కేవ&zwnj;ని మృతిని బంధువులు ఆవేద&zwnj;న వ్య&zwnj;క్తం చేశారు. గడచిన కొంతకాలంగా పీహెచ్సీలో రాత్రి సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండ&zwnj;క&zwnj;పోగా తాళాలు వేసి ఉంచుతున్నార&zwnj;ని, దీనివల్ల అత్యవసర వైద్యానికి వ&zwnj;స్తున్న గ&zwnj;ర్భ&zwnj;ణీలు కూడా ఇబ్బందులు పడుతున్నార&zwnj;ని గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉండవలసిన నలుగురు సిబ్బంది డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తుంది.&nbsp;</p> <h3>పీహెచ్&zwnj;సీ వైద్యాధికారి స&zwnj;స్పెన్ష&zwnj;న్&zwnj;..</h3> <p>విధులు పట్ల నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణపై చేబ్రోలు పిహెచ్ సి వైద్యాధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.వైద్యం అందగా రోగి మృతి చెందిన ఘటనపై చేబ్రోలు పీహెచ్సి లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ మంగళవారం విచారణ నిర్వ&zwnj;హించారు. ఈ ఘ&zwnj;ట&zwnj;న&zwnj;కు ప్రాథ&zwnj;మిక బాధ్యులుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి రతన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో తాళ్లరేవు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ ను డిప్యూటేషన్ పై నియమిస్తున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్స్ కు షోకాజు నోటీసు ఇచ్చినట్లు వివరించారు.&nbsp;</p> <p>గ&zwnj;త కొంత కాలంగా చేబ్రోలు పిహెచ్&zwnj;సీలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటుంద&zwnj;ని గ్రామ&zwnj;స్తులు, జ&zwnj;న&zwnj;సేన నాయ&zwnj;కులు వైద్య&zwnj;శాఖ ఉన్న&zwnj;తాధికారుల&zwnj;కు తెలిపారు. ఇక్క&zwnj;డ ఒక వైద్యుడు, ఒక న&zwnj;ర్సు మాత్ర&zwnj;మే సేవ&zwnj;లందిస్తుండా మిగిలిన వారు డిప్యూటేష&zwnj;న్ల&zwnj;పై మ&zwnj;రో చోట ప&zwnj;నిచేస్తున్నారు. దీంతో చేబ్రోలు పీహెచ్&zwnj;సీలో వైద్య&zwnj;సేవ&zwnj;లు అక్క&zwnj;ర&zwnj;కు రాకుండాపోతున్నాయ&zwnj;ని గ్రామ&zwnj;స్తులు మండిప&zwnj;డుతున్నారు..&nbsp;</p>
Read Entire Article