Petrol-Diesel Buying New Rule:చమురు సంక్షోభం నివారణకు చర్యలు! 5 వేల రూపాయలకు మించి పెట్రోల్ కొనలేరు! డీజిల్ కోటా 200 లీటర్లే!

3 weeks ago 5
ARTICLE AD
<p><strong>Petrol-Diesel Buying New Rule:</strong>కేరళలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు సంబంధించిన కొత్త రూల్స్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ప్రకారం రేషనింగ్ ద్వారా చమురు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే ఉన్న నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం.&nbsp;</p> <p>కొత్తగా తీసుకురాబోతున్న రూల్స్ ప్రకారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా ఐదు వేల రూపాయల పెట్రోల్&zwnj; కొట్టించుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తారు. అంతేకాకుండా, ఏ వినియోగదారుడు కూడా ఒకేసారి రెండు వందల లీటర్ కంటే ఎక్కువ డీజిల్&zwnj; కొనుగోలు చేయలేడు. అంటే ఒక్కో వినియోగదారుడు ఐదు వేల విలువైన పెట్రోల్, 200 వందల లీటర్ల డీజిల్&zwnj; మాత్రమే కొనుగోలు చేయగలడు. అంతకు మించి కొనుగోలు చేసేందుకు అనుమతి ఉండబోదని తెలుస్తోంది.&nbsp;</p> <p><iframe title="PM on Gold Purchase | ప్రధాని మోదీ బంగారం కొనొద్దని ఎందుకు చెప్తున్నారు ? | ABP Desam" src="https://www.youtube.com/embed/bHl3FD1tTVQ" width="919" height="517" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>అంతేకాదు చమురు రవాణా విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. భారీ డ్రమ్ముల్లో, క్యాన్&zwnj;లలో లేదా పెద్ద పెద్ద కంటైనర్&zwnj;లలో పెట్రోలియం సరఫరాను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వం చెప్పడానికి ముందే పెట్రోలియం వ్యాపారుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.&nbsp;</p> <p>కేరళ రాష్ట్రంలో 2500 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్&zwnj; కంపెనీలు ఎక్కువ కాలం సరఫరా చేసే పద్దతికి బదులు కేవలం రెండు మూడు రోజుల అవసరాలకు సరిపడా పెట్రోల్&zwnj; పంపులకు నిల్వలు విడుదల చేస్తున్నాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.&nbsp;</p> <p>ఒక వ్యక్తి ఒకేసారి వేల లీటర్ల చమురును కొనుగోలు చేస్తే, సాధారణ ప్రజలకు సరఫరా చేసే పంపు వద్ద నిల్వ వెంటనే అయిపోతుంది. దీనికి మరో కారణం ఏంటంటే, చమురు కంపెనీలు రుణ సౌకర్యాలు తొలగించి ముందస్తు చెల్లింపును తప్పనిసరి చేశాయి. దీని వల్ల చిన్న పంపు యజమానులు పెద్ద పరిమాణంలో నిల్వను ఆర్డర్ చేయడం కష్టమవుతుంది.&nbsp;</p> <h3>సాధారణ ప్రజలకు ఊరట&nbsp;</h3> <p>సాధారణ వాహహనం ఐదు వేలతో సులభంగా ట్యాంక్ నింపుకోగలదు. కాబట్టి, దీని వల్ల కారు, బైక్ లేదా ఆటో రిక్షా డ్రైవ్లపై ప్రభావం ఉండదు. అయితే సుదూర ప్రయాణాలు చేసే భారీ ట్రక్కులు, ప్రైవేటు బస్సులు, సరకు రవాణా చేసే వాహనాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వారి ప్రయాణాలకు రెండు వందల లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది.&nbsp;</p> <p>అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రజలు కంగారు పడొద్దని సూచిస్తున్నారు. అయితే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ప్రజలు భయాందోళనలకు గురై భారీ మొత్తంలో కొనుగోళ్లు చేయొద్దని ప్రభుత్వాలు రిక్వస్ట్ చేస్తున్నాయి. &nbsp;</p>
Read Entire Article