<p><strong>One Nation One Election Bill In Lok Sabha : </strong>వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభ ముందు ఈ బిల్లును ఉంచారు. 129వ రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ ఆమోదించాలని చెప్పారు. </p>
<p>బిల్లును <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a>, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీలు మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్దమని విమర్శించారు. <br />వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆప్ కూడా చెప్పేసింది. ఇది దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ ఎంపీలు. దీన్ని ఇక్కడితే ముగిస్తే దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుటుందన్నారు. </p>
<p>వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రక్రియ, పాలనలో స్పష్టత వస్తుందనే విషయం ఏపీలో చూశామన్నారు. ఇది మా అనుభవమని, దేశవ్యాప్తంగా ఇదే జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.</p>