Nuvvunte Naa Jathaga Serial Today December3rd: గుడిలోఒకరినొకరు చూసుకున్న రిషి,దేవా...తమ పెళ్లిరావాలంటూ మిధున,రిషిని ఆహ్వానించిన భానుమతి

2 days ago 2
ARTICLE AD
<p><strong>Nuvvunte Naa Jathaga Serial Today Episode:</strong> పెళ్లి శుభలేఖలకు పూజ చేయించేందుకు దేవా కుటుంబం గుడికి రాగా...కాబోయే భార్యాభర్తలిద్దరిని గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి రమ్మని పంతులుగారు చెబుతారు. దీంతో వెళ్తాం రమ్మని భాను దేవాను గట్టిగా కోరుతుంది. దీంతో &nbsp;ఒకవైపు &nbsp;మిధున, రిషి వాళ్ల వెనకనే దేవా,భాను రెండు జంటలూ &nbsp;గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. మార్గమధ్యలో భాను మిధున దరిద్రం మనకు వదిలిపోయిందని ఇక మనం హ్యాపీగా ఉండొచ్చని అంటుంది. దీంతో దేవా కోపంతో మండిపోతాడు. పదేపదే ఎందుకు మిధున ప్రస్తావన తీసుకొస్తున్నావంటూ &nbsp;కోపగించుకుంటాడు. ఇంకోసారి మిధున ప్రస్తావన తెచ్చావంటే మర్యాదగా ఉండదంటాడు. సరేలే అని భానుమతి అతని వెంట నడుచుకుంటూ వెళ్తుంది.<br />&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;దీంతో రెండు జంటలు ఒకదానికొకటి ఎదురుపడతాయి. అప్పుడు రిషి దేవాను చూసి గుర్తుపడతాడు. నువ్వేంటిరా ఇక్కడ ఉన్నావని అడుగుతాడు.<br />నాకు,మిధునకు ఈరోజు నిశ్చయ తాంబూలాలు రా...నీకోసం ఎంత ట్రై చేసినా నీ ఫోన్ కలవడం లేదని రిషి చెబుతాడు. దీంతో దేవా షాక్&zwnj;కు గురవుతాడు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలనుకున్నాను. లక్కీగా టైంకి భలే వచ్చావురా అంటాడు. మా నిశ్చయ తాంబూలాలకు ఆ దేవుడే నిన్ను పంపించాడురా అంటాడు. నీకొక ఫన్ని విషయం చెప్పనా....నీ నెంబర్&zwnj; మిధున ఫోన్&zwnj;లో మెగుడ్&zwnj; ఫ్రెండ్ అని సేవ్&zwnj;చేసుకోబోయి....మొగుడు అని సేవ్&zwnj; చేసుకుందని అంటాడు. నీ పేరు తప్ప ఇంకొకరి పేరు మాటవరసకు ఉన్నా తట్టుకోలేనని అంటాడు. దీంతో భాను ఆశ్చర్యపోతుంది. మాటవరసకు ఏంటి నిజంగా దేవానే దీని మొగుడని తెలిస్తే ఏమైపోతాడో &nbsp;ఏమో అనుకుంటుంది.<br />&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;మేం నిశ్చయ తాంబూలాల కోసం వచ్చాం. మరి మీరు ఎందుకు వచ్చారు. దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారా లేక ఇంకేమైనా ఇంపార్టెంట్ పనిఉందా అని అడుగుతాడు దేవానురిషి. &nbsp;దీనికి భాను సమాధానమిస్తూ...మీ జీవితంలోలాగే &nbsp;దేవా జీవితంలోనూ ఇవాళచాలా ఇంపార్టెంట్ రోజని చెబుతుంది. అయినా నువ్వు ఎవరు మా దేవా పక్కన అని అడగ్గా....దేవానే నాకు కాబోయే మొగుడని చెబుతుంది. మా పెళ్లి శుభలేఖలు దేవుడి వద్ద ఉంచి పూజ చేయించడానికే ఇక్కడికి వచ్చామని చెబుతుంది. ఈ విషయం తెలిసి మిధున బాధపడుతూ ఉంటుంది. ఇంతలో భాను కలుగజేసుకుని మా పెళ్లికి మీరు తప్పకుండా &nbsp;రావాలని పిలుస్తుంది. నీను రాకుండా వాడి పెళ్లి ఎలా జరుగుతుంది....నేనే దగ్గర ఉండి పెళ్లి పనులన్నీ చూసుకుంటానని రిషి చెబుతాడు. భాను కావాలనే మిధునను కూడా పెళ్లికి పిలుస్తుంది. మీరు తప్పకుండా ఈ పెళ్లికి వచ్చి మీ కళ్లారా మా పెళ్లిచూడాలని కోరుతుంది. దీంతో మేమిద్దరం కలిసే పెళ్లికి వస్తామని రిషి చెబుతాడు.<br />&nbsp; &nbsp;మిధునను పెళ్లికి పిలవడంతో రిషికి అనుమానం వస్తుంది.తను ముందే నీకు తెలుసా అని రిషి భానును అడుగుతాడు. అవును ఆమె నాకు ముందే తెలుసనని భాను చెబుతుంది. దీంతో మిధున, దేవా ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. రిషి ఎలా తెలుసని అడగ్గా....మొన్న మన ఆటో,కారు ఢీకొట్టినప్పుడు మీ పక్కనే ఉంటే చూశానులే అంటుంది. దేవా వాళ్ల అమ్మానాన్నలను పరిచయం చేస్తాను రా అంటూ మిధునను రమ్మని రిషి తీసుకెళ్తాడు.</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;దేవా,మిధున,రిషి కలిసి వెళ్లగా....భాను తిరిగి వాళ్ల అమ్మ దగ్గరికి వచ్చి ఈవిషయం చెబుతుంది.అప్పుడే పూజారి పూజ అయిపోయిందని చెప్పి పెళ్లి శుభలేక వారికి అందజేస్తాడు. అది చూస్తూ &nbsp;భాను మురిసిపోతుండగా...గాలికి ఎగిరిపోయి ఆ శుభలేఖ దీపంపై పడికాలిపోతుంది. శుభమా అని శుభలేఖకు పూజ చేయిస్తే ఇలా జరిగిందేమిటా అని భాను బాధపడిపోతుంది. శుభలేఖను అలా కిందపడేలా చేశావేంటమ్మా అని పంతులుగారు అంటారు. కొంత మంది చూపు మామీద పడింది కదాండీ...అలాగే జరుగుతాయి అని భాను వాళ్ల అమ్మ మిధునను చూసి అంటుంది. నా కుమార్తె పెళ్లి జరగకుండా &nbsp;ఎవరూ ఆపలేరని మండిపడుతుంది. దేవుడి దగ్గర పెట్టిన శుభలేక కాలిపోవడంతో తన పెళ్లి ఆగిపోతుందేమోనని భాను భయపడి ఏడుస్తుంటుంది. దీనికి పూజారి మంచి సలహా ఇస్తాడు...అగ్నికూడా దేవుడేనని మంచే చేస్తాడని చెప్పడంతో భానుకు కొంచెం ఊరట లభిస్తుంది.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://telugu.abplive.com/web-stories/cinema/samantha-raj-nidimoru-love-story-from-family-man-2-meeting-to-marriage-controversies-229310" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; దేవా కుటుంబాన్ని గుడిలో చూసిన త్రిపుర...ఆమె పరుగెత్తుకుంటూ వాళ్ల మామయ్య వద్దకు వెళ్తుంది. ఆగిపోయే నిశ్చయ తాంబూలాలకు హడావుడి ఎందుకు అంటుంది. ఎందుకు అశుభంంగా మాట్లాడుతున్నావని వాళ్లంతా త్రిపురపై మండిపడతారు. ఈ కార్యక్రమం చెడగొట్టడానికే ఆ దేవా కుటుంబం ఇక్కడికి వచ్చిందని చెబుతుంది. &nbsp;ఆ సత్యమూర్తి ,అతని భార్యను నేను గుడిలోచూశానని అంటుంది. వాళ్లు చెడగొట్టడానికి కాకపోతే &nbsp;ఇక్కడికి ఎందుకు వస్తారని అంటుంది. దీంతో రాహూల్ కోపంగా వెళ్లిపోతుండగా...వాళ్ల అమ్మ ఆపుతుంది.ఇక్కడ &nbsp;నీచెల్లి నిశ్చయ తాంబూలాలు జరుగుతుంటే నువ్వు వెళ్లి గొడవలు పెట్టుకుంటావా అంటూ మండిపడుతుంది. వాళ్లు మన ఇంటికి వస్తే నిజంగానే పెళ్లి ఆపడానికి వచ్చారు అనుకోవచ్చు. కానీ వాళ్లు గుడికి వచ్చారు రా...వాళ్లు కూడా మనలాగే ఏదో పనిమీద వచ్చి ఉండొచ్చు. వాళ్లు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా మనకు మనమే అన్నీ ఊహించుకుంటే ఎలా అని సముదాయిస్తుంది. మనకు మనమే తొందరపడి జరిగిపోయిన విషయాలన్నీ &nbsp;రిషికి తెలియజేయడం అవసరమా అని కొడుకుని ఆపుతుంది.</p>
Read Entire Article