<p><strong> Nindu Manasulu Serial Today Episode </strong>ప్రేరణ సిద్ధూకి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. కుమార్ చూసి ప్రేరణ అన్ని సార్లు చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు. అవసరం లేదులే అలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరంలేదు అని సిద్ధూ అంటాడు. </p>
<p>కుమార్ సర్ది చెప్పాలి అని చూస్తాడు. అర్థం చేసుకోలేకపోతే అక్కడితో ఆగిపోవాలని అంటాడు. నీ పర్సనల్ ఎప్పుడూ చెప్పలేదు కదరా అని అంటాడు. సిద్ధూ మాత్రం ఒప్పుకోడు. నాకే నీ గురించి పూర్తిగా తెలీదు.. ఇంక తనకేం తెలుస్తుంది. తనకి నువ్వేం వెనకేసుకురావొద్దని సిద్ధూ అంటాడు. ప్రేరణ చాలా బాధ పడుతుంటుంది. రంజిత్‌కి వడ్డీస్తూ మైమరిచిపోయి వడ్డించేస్తూనే ఉంటుంది. ఇంకా అదే ఆలోచిస్తున్నావా అక్క అని ఐశ్వర్య అంటుంది. అలా తిడితే ఎవరైనా ఫీలవుతారు కదా అని ఐశ్వర్య అంటుంది. రంజిత్ విషయం అడుగుతాడు. మా అక్క తన ఫ్రెండ్ విషయంలో తిట్టేసింది ఇప్పుడు ఫీలవుతుంది అని ఐశ్వర్య అంటుంది. అతని పర్సనల్‌ లైఫ్‌లో మంచి ఏదో చెడు ఏదో అతనికే తెలుస్తుంది మీరు ఎలా డిసైడ్‌ చేస్తారు. మీరు అతన్ని ఏదో అంటే హర్ట్ అయ్యాడు అంటే మీరు చాలా బాధ పెట్టారు అని అంటాడు. అంటే మా అక్క తప్పు చేసిందని అంటారా అంటే అవును అని రంజిత్ అనడంతో వెంటనే సారీ చెప్పమని ఐశ్వర్య ప్రేరణకి చెప్తుంది. సారీ చెప్తానని ప్రేరణ అంటుంది. బాధ పెట్టిన వాళ్లు ఇంటికి వెళ్లి సారీ చెప్పాలి అది నీ గొప్పతనం అని ఓనర్ చెప్తాడు. ఐశ్వర్య కరెక్ట్ అంటుంది. </p>
<p>గణ బిజినెస్ మెన్ రత్నాన్ని కలుస్తాడు. ఎవరు నువ్వు నన్ను కలవాలి అని చాలా ట్రై చేస్తున్నావ్ అని అడిగితే నేను మీ శత్రువుకి శత్రువుని అని అంటాడు. నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు అని రత్నం అంటే.. శత్రువులు ఉంటారు కానీ ఇంటి నుంచి గెంటేయరు.. ఆస్తి రాసుకోరు.. పెళ్లాం పిల్లల్ని చంపేస్తా అని బెదిరించరు అని గణ అనగానే రత్నం కోపంతో నువ్వు మాట్లాడేది అని అనగానే అవును నేను డైనోసార్‌తో తలపడాలి అనుకుంటున్నా.. ఆ శత్రువు మీద పగ తీర్చుకోవడానికి మీతో చేతులు కలపాలి అని ఉందని గణ అంటాడు. దానికి రత్నం వాడి పతనం నేను చూడాలి.. నీకేం సాయం చేయాలి.. ఏం కావాలి అని అడుగుతాడు. దానికి గణ ప్రస్తుతానికి నేను ఓ కేసులో ఇరుక్కున్నా.. మీరు 50 లక్షలు ఇవ్వండి నేను కేసు నుంచి బయట పడి అప్పుడు విజయానంద్‌ అంతు చూస్తా అని అంటాడు. ఇద్దరూ చేతులు కలుపుతారు. విజయానంద్ నీ పతనం మొదలైంది అని రత్నం హ్యాపీగా ఫీలవుతారు.</p>
<p>విజయానంద్‌కి ఓఫోన్ వస్తుంది. విజయానంద్ షాక్ అయి వాళ్ల ప్రతీ మూమెంట్ నాకు కావాలి అని అంటాడు. ఏమైంది సార్ అని విశ్వాసం అడిగితే గణని మనం తొక్కాలి అనుకుంటే వాడు నా శత్రువు రత్నం పక్కన చేరాడు.. అని చెప్తాడు. ఇద్దరూ కలిశారు అంటే ఊహించుకోలేకపోతున్నా సార్ అని విశ్వాసం అంటాడు. మన ఇల్లీగల్ బిజినెస్‌లు రత్నానికి తెలుసు అవి గణకి తెలిస్తే ప్రమాదం అని విజయానంద్ అంటాడు. </p>
<p>ఇందిర భర్తని పట్టుకొని ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదండీ అంత అనుమానాస్పదంగా ఉంది అని గణ ప్రవర్తనని గుర్తు చేసుకుంటుంది. గణ మందుల విషయంలో కంగారు పడుతున్నాడు. మీ కొడుకు ప్రవర్తన మీ విషయంలో అనుమానంగా ఉంది.. ఇన్నిరోజులుగా మందులు వేస్తున్నా మీలో చలనం లేకపోవడం లేదు ఏంటి.. డాక్టర్ కూడా రావడం లేదు అని అనుకుంటుంది. అనుమానంతో రిపోర్ట్స్ తీసి చూస్తుంది. సీక్రెట్‌గా రిపోర్ట్స్ తీసుకొని బయటకు వెళ్తుంది. ఈశ్వరిని చూసి చిన్న పని ఉందని చెప్పి వెళ్తాను అంటుంది. అన్నీ చేసేశానని చెప్పి వెళ్తుంది. </p>
<p>ప్రేరణ సిద్థూ గదికి వస్తుంది. సిద్ధూ బనియన్‌తో ఉంటే సార్ బట్టలు వేసుకోండి చూడలేకపోతున్నాం అని అంటుంది. ఏంటి మ్యాటర్ అని సిద్ధూ అంటే నీకు ఇంకా కోపం పోలేదు కదా అంటుంది. మాకు కోపం ఎందుకు ఉంటుంది అండీ మేం మనసులు అయితే కదా అని అంటాడు. ఆడపిల్లలా బాగానే ఎత్తి పొడుస్తున్నావ్ అని ప్రేరణ అంటుంది. అక్కడ తిట్టింది సరిపోదా ఇక్కడ కూడా తిట్టాలి అనుకుంటున్నావా అని సిద్ధూ అడుగుతాడు. ఎందుకు వచ్చావ్ అని సిద్ధూ అంటే నాకు మీ ఇంట్లో కాఫీ తాగాలి అనిపించి వచ్చా అంటుంది. సిద్ధూ కాఫీ చేయడానికి వెళ్లి సారీ చెప్పకుండా కాఫీ అడుగుతుంది మహానుభావురాలు అని సిద్ధూ అనుకుంటాడు. ఇంతలో అక్కడికి సాహితి, మంజుల వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. </p>