Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు

3 months ago 4
ARTICLE AD
<p>Andhra Pradesh News | అమరావతి: తెలంగాణ సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదని ఏపీ ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు &nbsp;మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం జగన్ వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఆర్డర్ వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని వినియోగించుకుంటున్నప్పుడు, దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు నుండి ఆంధ్రప్రదేశ్ సైతం నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.&nbsp;</p> <p><strong>గోడవలు వద్దు.. మాకు నీళ్లే కావాలి..</strong></p> <p>అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలకు, అభూత కల్పనలకు ఒక రూపం అంటూ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నిజాయితీకి, నిలకడకు, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఏపీ సీఎం చంద్రబాబు అని ఆయన కొనియాడారు. వైఎస్సార్ <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> పార్టీకి చెందిన మీడియా సంస్థల్లో ఎన్ని అబద్ధాలు అచ్చేసినా, రాష్ట్ర ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ నేతల వివాదాలను ఆంధ్రప్రదేశ్&zwnj;లోకి చొప్పించి, తద్వారా వైఎస్సార్సీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అవివేకమని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గోదావరి నది నుండి ఏటా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంటే, అందులో 200 టీఎంసీల నీటిని వినియోగించుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మాకు నీళ్లు కావాలా? గొడవలు కావాలా? అంటే మా ప్రభుత్వం నీళ్లను కోరుకుంటుందని అన్నారు.&nbsp;</p> <p><strong>జగన్ వల్లే రాయలసీమ పథకానికి స్టే ఆర్డర్.. నిమ్మల రామానాయుడు</strong><br />రాష్ట్ర చరిత్రలో రాయలసీమ ప్రాంతానికి ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో జగన్ ద్రోహం చేశారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5వ తేదీన జగన్ సర్కార్ ఆమోదముద్ర వేసింది. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే (మే 20న) ఎన్జీటీ నుండి స్టే ఆర్డర్ వచ్చేలా వ్యవహరించిందని ఆరోపించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేవలం 2,000 కోట్లు కేటాయించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సీమ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలను వివరించారు.</p> <p><strong>హంద్రీనీవా కోసం రూపాయి ఖర్చు చేయలేదు.. తట్టెడు మట్టి తీయలేదు</strong><br />ఐదేళ్ల హయాంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన హంద్రీనీవా ప్రాజెక్టును, తమ ప్రభుత్వం కేవలం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసి చూపించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రాయలసీమ మీద నిజంగా ప్రేమ ఉంటే, గత ఐదేళ్లలో హంద్రీనీవా కోసం కనీసం ఒక్క రూపాయి ఖర్చు ఎందుకు చేయలేదు? ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదు? అని <a title="జగన్" href="https://telugu.abplive.com/topic/cm-jagan" data-type="interlinkingkeywords">జగన్</a>&zwnj;ను మంత్రి నిమ్మల ప్రశ్నించారు. శ్రీకృష్ణదేవరాయల పాలన తర్వాత, మళ్లీ చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయని అన్నారు. <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> హయాంలోనే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ (738 కి.మీ), మడకశిర బ్రాంచ్ కెనాల్ (493 కి.మీ) ద్వారా అమరాపురం చెరువు వరకు కృష్ణా జలాలను తరలించిన ఘనత దక్కుతుందని పేర్కొన్నారు.&nbsp;</p>
Read Entire Article