NEET-UG 2025: నీట్‌ యూజీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేదీ ఎప్పుడంటే? పరీక్షతేదీ ఇదే!

9 months ago 8
ARTICLE AD
<p style="text-align: justify;"><strong>NEET UG 2025 Application:</strong> దేశంలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్&zwnj;, బీడీఎస్&zwnj; సహా ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నేషనల్&zwnj; ఎలిజిబిలిటీ కమ్&zwnj; ఎంట్రెన్స్&zwnj; టెస్ట్&zwnj;(నీట్&zwnj;-యూజీ)-2025' దరఖాస్తుల స్వీకరణ పక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 7 రాత్రి 11:50 గంటల వరకు ఆన్&zwnj;లైన్&zwnj;లో దరఖాస్తుతోపాటు నిర్ణీత ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత మార్చి 9 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు నీట్&zwnj;-యూజీ పరీక్ష కోసం సన్నద్ధమవతుంటారు. గతేడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంబీబీఎస్&zwnj;లో మొత్తం 1,08,000 సీట్లు అందుబాటులో ఉండగా.. సుమారుగా 56 వేల సీట్లు ప్రభుత్వ, 52 వేల సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>పరీక్ష ఫీజు ఎంతంటే?</strong><br />నీట్ యూజీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు పరీక్ష ఫీజుగా జనరల్&zwnj; క్యాటగిరీవారు రూ.1700; ఈడబ్ల్యూఎస్&zwnj;, ఓబీసీ వర్గాలకు చెందినవారైతే రూ.1600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.1000గా నిర్ణయించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 4న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్&zwnj;లైన్&zwnj; విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి సిటీ ఇంటీమేషన్ స్లిప్స్&zwnj;&zwnj;ను ఏప్రిల్&zwnj; 26న విడుదల చేయనున్నారు. విద్యార్థులు మే 1 నుంచి నీట్ అడ్మిట్&zwnj;కార్డులు డౌన్&zwnj;లోడ్&zwnj; చేసుకోవచ్చు. జూన్&zwnj; 14లోపు ఫలితాలు విడుదల చేయనున్నారు.&nbsp;</p> <p style="text-align: center;"><em><span style="font-size: 14pt;"><a title="NEET(UG)-2025 Registration and Online Application - External site that opens in a new window" href="https://examinationservices.nic.in/neet2025/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFcFR+natXIEjJ1rCf6DMgOr/hcv4rs34T5gNmvCx/R+a" target="_blank" rel="noopener noreferrer" aria-label="NEET(UG)-2025 Registration and Online Application - External site that opens in a new window"><strong>NEET(UG)-2025 Registration and Online Application</strong></a></span></em></p> <p style="text-align: center;"><em><strong><span style="font-size: 18pt;"><a title="Press Note" href="https://cdnbbsr.s3waas.gov.in/s37bc1ec1d9c3426357e69acd5bf320061/uploads/2025/02/2025020745.pdf" target="_blank" rel="noopener">Press Note</a></span></strong></em></p> <p style="text-align: justify;"><strong>పాతవిధానంలోనే పరీక్ష..</strong><br />దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్&zwnj;(National Eligibility cum Entrance Test) యూజీ (NEET UG 2025) పరీక్షను ఆన్&zwnj;లైన్&zwnj; కాకుండా ఆఫ్&zwnj;లైన్&zwnj; విధానంలోనే నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షను పాతవిధానంలోనే నిర్వహించనున్నట్లు నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (ఎన్&zwnj;టీఏ) వెల్లడించింది. ఇకపై పాత విధానంలోనే 180 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రంతో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు(3 గంటలు) ఉండనుంది. కేంద్ర విద్య, ఆరోగ్యశాఖల మధ్య సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు ఓఎంఆర్&zwnj; పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్&zwnj; మెడికల్&zwnj; కమిషన్&zwnj; (NMC) నిర్ణయం మేరకు.. నీట్&zwnj; యూజీ పరీక్ష పెన్&zwnj;-పేపర్&zwnj; విధానంలో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్టులో ఈ పరీక్ష ఉంటుందని నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (NTA) వెల్లడించింది.</p> <p style="text-align: justify;"><strong>ప్రశ్నల ఎంపిక విధానానికి స్వస్తి..</strong><br />నీట్ యూజీ పరీక్షకు సంబంధించి కోవిడ్&zwnj; సమయంలో ప్రవేశపెట్టిన ప్రశ్నల ఎంపిక విధానం తీసివేసినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిజిక్స్&zwnj;, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 45 చొప్పున ప్రశ్నలు, బయాలజీలో నుంచి 90 ప్రశ్నలకు 3 గంటల్లో పరీక్షను రాయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పెన్&zwnj;-పేపర్&zwnj; (OMR based) విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.</p> <p style="text-align: justify;">నీట్&zwnj; ఫలితాల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్&zwnj;తోపాటు.. నేషనల్&zwnj; కమిషన్ ఫర్&zwnj; హోమియోపతి కింద బీహెచ్&zwnj;ఎంఎస్&zwnj; (BHMS) కోర్సులో ప్రవేవాలు చేపడతారు. దీంతోపాటు ఆర్మ్&zwnj;డ్&zwnj; మెడికల్&zwnj; సర్వీస్&zwnj; హాస్పిటల్స్&zwnj;లో బీఎస్సీ నర్సింగ్&zwnj; (BSc Nursing) కోర్సులో ప్రవేశాలకు నీట్ యూజీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇక నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్&zwnj; కోర్సుకు కూడా నీట్&zwnj; యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని నేషనల్&zwnj; టెస్టింగ్&zwnj; ఏజెన్సీ (NTA) తెలిపింది.</p> <p style="text-align: justify;"><strong>ఆన్&zwnj;లైన్&zwnj;పై వెనక్కి..</strong><br />దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్&zwnj; యూజీ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నీట్ యూజీ పరీక్షకు గతేడాది 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్&zwnj; తరహాలోనే ఈసారి (2025) కూడా నీట్&zwnj; యూజీని ఆన్&zwnj;లైన్&zwnj; విధానంలో నిర్వహించాలని ఎన్&zwnj;టీఏ భావిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఇస్రో మాజీ ఛైర్మన్&zwnj; కస్తూరి రంగన్&zwnj; ఛైర్మన్&zwnj;గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్&zwnj;లైన్&zwnj; విధానం (కంప్యూటర్&zwnj; బేస్డ్&zwnj; టెస్ట్&zwnj; - CBT)లో నీట్&zwnj; నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే, తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన విస్తృత చర్చల్లో ఓఎంఆర్&zwnj; పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.</p> <p style="text-align: center;"><strong><a title="మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.." href="https://telugu.abplive.com/education" target="_blank" rel="nofollow nofollow noopener">మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..</a></strong></p>
Read Entire Article