Narayana College : నారాయణ ఇంటర్ స్టూడెంట్స్ వెకిలి చేష్టలు- హయత్‌నగర్‌లో కాలేజీకి తాళం వేసిన స్థానికులు

10 months ago 7
ARTICLE AD
<p><strong>Narayana College :</strong> ఈ మధ్య నారాయణ కాలేజీల గురించి వస్తోన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా రంగారెడ్డి హయత్ నగర్ సామ నగర్ లోని నారాయణ కళాశాల ముందు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీ మహిళలు రోడ్డుపై వెళ్తున్నప్పుడు, బాల్కనీలో ఉన్నప్పుడు విద్యార్థులు వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పలు రకాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలను అక్కడ్నుంచి వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నారాయణ కాలేజీకి స్థానికులు తాళాలు వేశారు.&nbsp;</p> <p><strong>కాలనీలో ఉండాలంటేనే భయమేస్తోంది..</strong><br />నారాయణ కళాశాల ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థుల ప్రవర్తనపై సామ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మహిళలు రోడ్డు పై వెళ్తున్నపుడు, ఇంట్లో బాల్కనీలో ఉన్నపుడు వారిపైకి పేపర్ రాకెట్లు విసిరేస్తున్నారని, లేజర్ లైట్లు కొడుతూ బూతులు తిడుతున్నారని ఆరోపించారు. కిటికీలో నుంచి టవల్ విప్పి న్యూడ్ గా చూడమంటూ కేకలు వేస్తున్నారన్నారు. కాలనీలో ఉండాలంటేనే &nbsp;భయంగా ఉందన్న మహిళలు.. వారి కుటుంబసభ్యులతో వచ్చి కళాశాల ముందు ఆందోళనకు దిగారు. మహిళలే కాదు వారి కుటుంబసభ్యులు ఎవరు కనిపించినా అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని నారాయణ కళాశాల యజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ కళాశాల యాజమాన్యం పిల్లలకు చదువు నేర్పించడం లేదని, ఇలా మహిళలతో బూతుగా ప్రవర్తించాలని మాత్రమే నేర్పిస్తున్నారని తిట్టిపోశారు. ఈ కళాశాలను ఇక్కడి నుంచి తీసేయాలని, తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నారాయణ కాలేజి ప్రిన్సిపల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.<br /><br /><strong>కాలేజీ భవనం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య</strong></p> <p>జనవరి 23, 2025న ఇంటర్ చదువుతున్న విద్యార్థి చరణ్ అనే విద్యార్థి కళాశాల భవనం 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్ ఆంధ్రప్రదేశ్&zwnj;లోని అనంతపురం నగర శివార్లలోని సోమలదొడ్డి దగ్గరున్న నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత జనవరి 23న తన పెదనాన్న కుమారుడు భరత్ స్వయంగా చరణ్&zwnj;ను తీసుకెళ్లి కళాశాలలో వదిలి వెళ్లాడు. అప్పుడే కాలేజ్ ఫీజు కట్టాలని తనకు ఫోన్ చేయడంతో తాను వచ్చిన కడతానని చెప్పానని చరణ్ తండ్రి చెప్పాడు. ఆ తర్వాత చరణ్ ను లోనికి అనుమతించారన్నారు. ఈ విషయంలో కాలేజ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదననారు. కానీ అంతకుముందు 23న ఘటన జరిగిన వెంటనే కళాశాలకు చేరుకున్న చరణ్ తండ్రి వెంకట నారాయణ.. ఫీజు కట్టలేదని నిలదీయడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మీడియా ముందు ఆరోపించారు. ముందు అలా చెప్పి, ఆ తర్వాత మాట ఎందుకు మార్చాడన్న విషయం మాత్రం తెలియలేదు.</p> <p>ఇక విద్యార్థి సంఘాల నాయకుల నుంచి కూడా ఇదే తరహా వాదన వినిపిస్తోంది. ఫీజుల కోసం కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఫీజు కట్టలేదని బయట నిలబెట్టడం వల్లే చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అనేక మంది విద్యార్థిలు చనిపోతున్నా యాజమాన్యం తీరులో ఎలాంటి మార్పు రావడం లేదని అంటున్నారు. మానసికంగా ఒత్తిడికి గురై రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెబుతున్నారు.</p> <p><strong>Also Read : <a href="https://telugu.abplive.com/telangana/hyderabad/assembly-secretary-issues-notices-to-mlas-who-defected-from-party-in-telangana-196647">Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు, అలర్ట్ అయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్</a></strong></p> <p>&nbsp; &nbsp;</p>
Read Entire Article