Maoists Letter : "హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్

22 hours ago 1
ARTICLE AD
<p><strong>Maoists Letter :&nbsp;</strong>మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్&zwnj;కౌంటర్ తర్వాత సైలెంట్&zwnj;గా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు కీలక ప్రకటన చేశారు. వికల్ప్&zwnj; పేరుతో ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిడ్మాతోపాటు 13 మంది పోలీసులు హత్య చేశారని ఆరోపించారు. వారి రహస్య సమాచారాన్ని చేరవేసిన వారి పేర్లను కూడా ఆ లేఖలో తెలిపారు. వారి కారణంగానే హిడ్మాను పట్టుకొని హత్య చేశారని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.&nbsp;</p> <p>హిడ్మా అక్టోబర్&zwnj; 27వ తేదీన విజయవాడ వచ్చినట్టు మావోయిస్టులు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వచ్చినట్టు లేఖలో తెలిపారు. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న కోసాల్ అనే కలప వ్యాపారితోపాటు మరో ముగ్గురు కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారని ఆరోపించారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు హిడ్మాను పట్టుకొని కాల్చి చంపేశారని అన్నారు. ఆయనతోపాటు 13 మందిని హత్య చేశారని ధ్వజమెత్తారు.&nbsp;</p> <p>హిడ్మా రహస్య సమాచారాన్ని దేవ&zwnj;జీ చెప్పాడనే పుకార్లు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం దేవ్&zwnj;జీ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. హిడ్మా ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం కోసాల్ అనే కలప వ్యాపారి సహాయంతో విజయవాడ చేరుకున్నాడని వివరించారు. ఈ విషయాన్ని ఆయన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి పోలీసులకు చేరవేశారని తెలిపారు. హిడ్మాతోపాటు మరో 13 మందిని మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపించారు.&nbsp;</p> <p>కేంద్రం బలగాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్ కాదని, హిడ్మాను వాళ్లంతా కలిసి చంపేశారని మావోయిస్టులు లేఖో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ హత్యను కప్పిపుచ్చుకోవడానికి మారేడుమిల్లి ఎన్&zwnj;కౌంటర్ అని కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు.&nbsp;</p> <h3>బీజాపూర్&zwnj;లో ఎన్&zwnj;కౌంటర్ 13 మంది హతం</h3> <p>మరోవైపు ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం (డిసెంబర్ 3)న ప్రారంభమైన పోలీసు-నక్సల్ ఎన్&zwnj;కౌంటర్ గురువారం (డిసెంబర్ 4) ఉదయం వరకు కొనసాగింది. ఈ సుదీర్ఘమైన, భయంకరమైన ఎన్&zwnj;కౌంటర్&zwnj;లో భద్రతా బలగాలు 18 మంది నక్సల్స్&zwnj;ను హతమార్చాయి. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. మరణించిన నక్సల్స్&zwnj;లో 16 మందిని గుర్తించారు. వీరంతా PLGA బెటాలియన్ నంబర్-2కి చెందిన యాక్టివ్ కేడర్&zwnj;లు. వీరిపై మొత్తం 1 కోటి 30 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.</p> <h3>వెల్లా మోడియం సహా పలువురు పెద్ద నక్సల్ కమాండర్లు హతం</h3> <p>ఎన్&zwnj;కౌంటర్&zwnj;లో మరణించిన నక్సల్స్&zwnj;లో PLGA కంపెనీ నంబర్-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు, అతనిపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. బీజాపూర్ జిల్లాలో అతనిపై 44 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.</p> <p>ప్లాటూన్ నంబర్-13 కమాండర్ DVCM జిత్ర్ ఓయం, DVCM మోటు కవాసి కూడా హతమయ్యారు. భద్రతా బలగాలు చాలా కాలంగా వీరి కోసం వెతుకుతున్నాయి. వీరంతా పశ్చిమ బస్తర్ డివిజన్&zwnj;కు చెందిన యాక్టివ్ మావోయిస్టులు.</p> <h3>సమాచారం తర్వాత పెద్ద సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం</h3> <p>కచిల్వార్-పోటేనార్ అడవుల్లో PLGA కంపెనీ నంబర్-2 కమాండర్ వెల్లా మోడియం తన దాదాపు 25-30 మంది మావోయిస్ట్ కేడర్&zwnj;లతో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందిందని బస్తర్ ఐజీ సుందర్&zwnj;రాజ్ పి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత DRG, STF, కోబ్రా బెటాలియన్ల సంయుక్త బృందాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.</p> <p>ఉదయం 9 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి అంతా ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. గురువారం ఉదయం 8 గంటల వరకు ఎన్&zwnj;కౌంటర్ కొనసాగింది. భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి 19 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి, వాటిలో 4 AK-47లు, 1 లైట్ మెషిన్ గన్, 4 SLRలు, 3 నాట్-3 రైఫిల్స్, ఇన్సాస్, 12 బోర్ గన్&zwnj;లు ఉన్నాయి. దీనితో పాటు, భారీగా పేలుడు పదార్థాలు, నక్సల్స్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.</p>
Read Entire Article