Manmohan Singh: 10 గంటల సర్జరీ తర్వాత మన్మోహన్ తొలి ప్రశ్న? - దేశం పట్ల అంకిత భావానికి నిదర్శనమంటే ఇదేనేమో!

11 months ago 7
ARTICLE AD
<p><strong>Intersting Facts About Manmohan Singh: </strong>మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్&zwnj;లో (Delhi AIIMS) చికిత్స పొందుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు దేశంపై ఉన్న అంకిత భావాన్ని ఓ సంఘటన వెల్లడిస్తుంది. ప్రధానిగా ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయం సంబంధిత సర్జరీ చేసుకున్న అనంతరం ఆయన పలికిన పలుకులే దీనికి నిదర్శనమని.. వైద్యులు వెల్లడించారు. 10 గంటల సర్జరీ తర్వాత ఆయన తొలి ప్రశ్న దేశం గురించే అడిగారని సర్జరీ చేసిన వైద్యుల్లో ఒకరైన రమాకాంత్ పాండా వెల్లడించారు. '2009లో మన్మోహన్ సింగ్&zwnj;కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హార్ట్ సర్జరీ జరిగింది. అనంతరం ఆయన కాస్త కోలుకున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడానికి వీలుగా అమర్చిన ఒక పైప్ తొలగించాం. ఆ వెంటనే మన్మోహన్ దేశం గురించే అడిగారు. నా దేశం ఎలా ఉంది?. కశ్మీర్ ఎలా ఉంది.? సర్జరీ గురించి నాకు ఎలాంటి బెంగా లేదు. నా ఆలోచనంతా నా దేశం గురించే' అని అన్నట్లు వైద్యుడు వెల్లడించారు. కాగా, ఎయిమ్స్ ఢిల్లీలోనే ఈ సర్జరీ జరిగింది.</p> <p><strong>Also Read: <a title="Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు" href="https://telugu.abplive.com/news/pm-modi-pays-tribute-to-predecessor-manmohan-singh-at-his-residence-video-191990" target="_blank" rel="noopener">Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు</a></strong></p>
Read Entire Article