Madya Pradesh: 100 మార్కులకు పరీక్ష రాసి 101 మార్కులు సాధించారు - ఇక ఉద్యోగం ఇచ్చేస్తారా ?

11 months ago 8
ARTICLE AD
<p><strong>Madya Pradesh candidate gets 101 out of 100 in recruitment exam in Indore:</strong> ఎంత ప్రతిభావంతుడైనా వందకు వంద మార్కులు తెచ్చుకుంటారు. వందకు నూట ఒకటి మార్కులు తెచ్చుకుంటే అతన్ని ప్రతిభావంతుడు అంటారో.. ఆ పరీక్ష పేపర్ దిద్దిన మాస్టార్ని ప్రతిభావంతుడు అంటాలో తేల్చుకోవడానికి మనకు సమయం పడుతుంది. అలాంటి విచిత్రం మధ్యప్రదేశ్ లో జరిగింది. అది కూడా ఉద్యోగ నియామక పరీక్షల్లో.&nbsp;</p> <p><strong>ఫారెస్ట్,జైలు గార్డుల ఉద్యోగాల కోసం గత ఏడాది పరీక్ష&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>2023లో వ్యాన్ అండ్ జైల్ రిక్రూట్ మెంట్ టెస్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. తాజాగా ఆ ఫలితాలు విడుదల చేశారు. అందులో ఓ అభ్యర్థికి 101.66 &nbsp;మార్కులు వచ్చినట్లుగా తేల్చారు. మామూలుగా అయితే అందరూ ఆ అభ్యర్థి ఇంటికి పోయి ఎలా సాధించారు.. అని స్ఫూర్తిదాయక కథనాలు రాసేవారు. సోషల్ మీడియాను హోరెత్తించేవారు.కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం రివర్స్ లో &nbsp;ఉంది పరిస్థితి. అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఆ అభ్యర్థి బయటకు రావడడం లేదు. పరీక్షలు పెట్టిన వారి పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే.. ఆ పరీక్ష పెట్టింది వంద మార్కులకే. వంద మార్కుల పరీక్షలో 101.66 మార్కులు ఎలా వస్తాయన్నది ఇప్పుడు వారు చెప్పాల్సిన సమయం వచ్చింది.&nbsp;</p> <div id="article-hstick-inner" class="abp-story-detail "> <p><strong>Also Read:&nbsp;<a title="Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్&zwnj; చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్&zwnj;తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల" href="https://telugu.abplive.com/telangana/hyderabad/manchu-manoj-mother-nirmala-wrote-a-letter-to-the-police-against-him-190819" target="_blank" rel="noopener">Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్&zwnj; చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్&zwnj;తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల</a></strong></p> </div> <div class="article-footer"> <div class="article-footer-left "><strong>కొంత మంది వంద కంటే ఎక్కువ మార్కులు&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</strong></div> </div> <p>మరో వైపు పరీక్షల్లో అక్రమాలు చేసి తమకు అన్యాయం చేశారంటూ.. &nbsp;యువత, ఆ ఉద్యోగ పరీక్ష రాసిన వారు రోడ్డెక్కుతున్నారు. పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ స్కాంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని సీఎం కలిసి వారి విజ్ఞాపనా పత్రం కూడా &nbsp;తీసుకున్నారు. అయితే అధికారులు మాత్రం తాము కొత్తగా నార్మలైజేషన్ అనే ప్రక్రియ చేపట్టామని చెబుతున్నారు. ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేష్ లో భాగంగా వంద కంటే ఎక్కువ మార్కులు అభ్యర్థికి రావొచ్చని అలాగే సున్నా కంటే తక్కువ మార్కులు కూడా రావొచ్చని వివరణ ఇస్తున్నారు.&nbsp;</p> <p><strong>Also Read:&nbsp;<a title="ఆపరేషన్ అని బెయిల్&zwnj;పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?" href="https://telugu.abplive.com/entertainment/cinema/darshan-operation-drama-kannada-actor-skips-surgery-heads-directly-to-court-after-discharged-from-hospital-raises-questions-on-bail-190801" target="_blank" rel="noopener">ఆపరేషన్ అని బెయిల్&zwnj;పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?</a></strong></p> <p><strong>నార్మలైజేషన్ ప్రక్రియ పెట్టామని అందులో వస్తాయంటున్న అధికారులు&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</strong></p> <p>ఇలా అసలు మార్కులకన్నా ఎక్కువ మార్కులు రావడం &nbsp;ఉద్యోగ నియామకల చరిత్రలో మొదటి సారి అని అభ్యర్థుు మండిపడుతున్నారు. ఈ ప్రాసెస్ ఆఫ్ నార్మలైజేషన్ ప్రక్రియలో పారదర్శకత లేదని మొత్తంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలన్నీ ఫారెస్ట్ డిపార్టుమెంట్ లో గార్డులు, జైలు గార్డులకు సంబంధించిన ఉద్యోగాలు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి లోకం అంతా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.&nbsp;</p>
Read Entire Article