Loksabha: వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లులు - 298 దగ్గరే ఆగిపోయిన ఎన్డీఏ - కావాలనే వెనక్కి తగ్గారా?

1 month ago 6
ARTICLE AD
<p>Constitutional Amendment Bills &nbsp;defeated: &nbsp;మహిళా రిజర్వేషన్లు, &nbsp;నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగసవరణ బిల్లు లోక్ సభలో వీగిపోయింది. &nbsp;ప్రత్యేక మెజారిటీ 352 ఓట్లు లభించకపోవడంతో వీగిపోయినట్లుగా స్పీకర్ ప్రకటించారు. &nbsp;బిల్లుకు అనుకూలంగా మెజారిటీ &nbsp;298 &nbsp;సభ్యులు ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. &nbsp;<br />&nbsp;&nbsp;<br />బిల్లుపై జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా , విపక్ష నేతల మధ్య ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. లోక్&zwnj;సభ స్థానాలు 50 శాతం &nbsp;పెరుగుతాయని &nbsp;గురించి స్పష్టత లేదని విపక్షాలు ప్రశ్నించగా.. ఇప్పుడే బిల్లులో ఆ మార్పు చేస్తే మద్దతిస్తారా &nbsp;అని అమిత్ షా సవాల్ విసిరారు. దీనికి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సానుకూలంగా స్పందించినప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా వెనక్కి తగ్గకుండా నేరుగా ఓటింగ్&zwnj;కే మొగ్గు చూపడం గమనార్హం. ఈ పరిణామం ప్రభుత్వం పట్టుదలకు పోయిందా లేదా విపక్షాల చిత్తశుద్ధిని పరీక్షించాలనుకుందా అనే చర్చకు దారితీసింది.<br />&nbsp;<br />రాజ్యాంగ సవరణను ఆమోదించుకోవడానికి సాధారణంగా తెరవెనుక జరిగే దౌత్య ప్రయత్నాలు &nbsp; ఈసారి ఎన్డీయే కూటమి పెద్దగా చేసినట్లు కనిపించలేదు. కేవలం సభా వేదికగా సభ్యులకు విజ్ఞప్తి చేయడమే తప్ప, తటస్థ పార్టీలను లేదా అసంతృప్త సభ్యులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. &nbsp; ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రభుత్వం తన పంథాను మార్చుకుంది. 2023లో ఆమోదం పొందిన పాత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా, డీలిమిటేషన్&zwnj;తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.&nbsp;</p>
Read Entire Article