Kisan Patra Yojana: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బు రెట్టింపు అవుతుంది

2 months ago 3
ARTICLE AD
<p style="text-align: justify;"><strong>Post Office Kisan Vikas Patra Yojana: </strong>గతంతో పోల్చితే ఇప్పుడు అందరికీ పెట్టుబడిపై అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్వెస్ట్&zwnj;మెంట్ ఒక ముఖ్యమైన భాగం. జీవితంలో డబ్బు ఎప్పుడు అవసరమో తెలియదు. అలాంటి పరిస్థితిలో ప్రజలు సహాయం చేయకపోయినా, మీరు చేసే నగదు పెట్టుబడి ఉపయోగపడుతుంది. సురక్షితమైన పెట్టుబడి ఎలా చేయాలో, డబ్బును ఎలా పెంచాలని ప్రజలు తరచుగా ఆలోచిస్తారు.&nbsp;</p> <p style="text-align: justify;">మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా, పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర యోజన మీకు మంచి ఎంపిక కానుంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తమ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. కనుక ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎన్ని నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుందన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.&nbsp;&nbsp;</p> <h4 style="text-align: justify;"><strong>కిసాన్ వికాస్ పత్ర యోజనలో డబ్బు రెట్టింపు</strong></h4> <p style="text-align: justify;">కిసాన్ వికాస్ పత్ర యోజన (<strong>Vikas Patra Yojana</strong>) అనేది సురక్షితమైన పోస్టాఫీసు పథకం. ఇది దీర్ఘకాలికంగా పెట్టుబడిదారులకు స్థిరంగా వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం 8.4 సంవత్సరాల కాలంలో అంటే దాదాపు 100 నెలల కాలంలో రెట్టింపు అవుతుంది. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఈ పథకంలో ఏ భారతీయ పౌరుడైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 అని పోస్టాఫీసు తెలిపింది. గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి విధించ లేదు.&nbsp;&nbsp;</p> <h3 style="text-align: justify;"><strong>ఎలా పెట్టుబడి పెట్టాలి?</strong></h3> <p style="text-align: justify;">కిసాన్ వికాస్ పత్ర యోజనలో మీరు ఇన్వెస్ట్ పెట్టడం సులభం. మీకు పాస్&zwnj;పోర్ట్ సైజు ఫోటో, గుర్తింపు కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీసులో తీసుకోవచ్చు లేదా ఆన్&zwnj;లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దీనికి సంబంధించి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు.</p> <p style="text-align: justify;">ఈ సర్టిఫికేట్ ఆధారంగా మీ పథకం గడువు ముగిసిన తర్వాత, మొత్తం నగదు, వడ్డీ రెండూ పెట్టుబడిదారుడి ఖాతాకు తిరిగి జమ అవుతాయి. ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది పూర్తిగా సురక్షితం, పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడి అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర యోజన పథకం గురించి మరింత సమాచారం కావాలనుకునే వారు సమీపంలోని పోస్ట్ ఆఫీసుకు వెళ్లాలి.</p> <p style="text-align: justify;">&nbsp;</p>
Read Entire Article