<p>Kazipet Murder Case : కడప జిల్లాలో యువతిని హత్య చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అతనిడి రెండు కాళ్లపై ఫైర్ చేయడంతో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ నిందితుడిని రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. </p>
<p>ప్రేమ పేరుతో వేధిస్తూ, ఆకర్షణను ప్రేమగా భ్రమపడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్ని ఘటన కడప జిల్లా ఖాజీపేట మండలంలో జరగింది. అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల రామకీర్తన అనే బాలికపై వెంకటేష్ అనే యువకుడు కక్ష పెంచుకున్నాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఉన్మాదిలా మారి పట్టపగలే ఆమె ఇంటిలోకి చొరబడి గొంతుకోసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. </p>
<p>ఈ దారణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామకీర్తన మరణం ఆమె తల్లిదండ్రులను తీరని శోకంలో ముంచింది. ఈ నెల 14వే తేదీన ఆమె పుట్టినరోజు ఉండటంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొనాల్సి ఉండగా, అంతలోనే ఈ ఘాతుకం చోటు చేసుకుంది. పుట్టినరోజు కోసం కొత్త బట్టలు కూడా కొన్నామని , ఇంతలోనే బిడ్డ విగత జీవిగా మారిందని ఆమె తల్లిదండ్రులు కడప రిమ్స్‌ వద్ద రోధించిన తీరు కంటతడి పెట్టించింది. </p>
<h3>నిందితుడిపై పోలీసులు కాల్పులు</h3>
<p>రామకీర్తన హత్య తర్వాత పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున విచారణ నిమిత్తం మైదకూరు నుంచి అతడిని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బసాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే నిందితుడు పోలీసులను బోల్తా కొట్టించి తప్పించుకోవాలని చూశాడు. ఆ క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్‌పై దాడి చేసి వారిని గాయపరిచాడు. పోలీసులు అతిడిని లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ, నిందితుడు వినకుండా పారిపోయేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు, నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు అనివార్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో నిందితుడు వెంకటేష్‌ రెండు మోకాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి, రిమ్స్‌కు తరలించారు. </p>
<p>ప్రస్తుతం రిమ్స్‌ ఆసుపత్రి వద్ద పోలీసుల బందోబస్తు మధ్య వెంకటేష్‌కు చికిత్స అందిస్తున్నారు. రామకీర్తన హత్య జరిగిన వెంటనే స్థఆనిక ప్రజలు, బంధువులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజీపేటలో కడపృ కర్నూలు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించి, ట్రాఫిక్ స్తంభింపజేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంతలో పోలీసులు కాల్పులు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. </p>