Kakinada District Crime News: ఇంటి నిర్మాణం విషయంలో ఘర్షణ- ముగ్గురు ప్రాణాలు తీసిన వివాదం- కాకినాడలో దారుణం

11 months ago 7
ARTICLE AD
<p><strong>Samarlakota Crime News:</strong> కాకినాడ జిల్లా సామర్ల కోట మండలంలోని వేట్లపాలెంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణం విషయంలోతలెత్తిన వివాదం ఇప్పుడు హత్యల వరకు వెళ్లింది.&nbsp;</p> <p>వేట్లపాలెంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ప్రక్రియ ప్రారంభించారు. అక్కడే అంబేద్కర్&zwnj; విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటూ బచ్చల చక్రయ్య ఫ్యామిలీ ఎదురు తిరిగింది. ఇదే ఈ రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజేసింది. హత్యలకు దారి తీసింది.&nbsp;</p> <p><img src="https://pbs.twimg.com/media/Ge2v8_ybwAAlRuY?format=jpg&amp;name=small" alt="Image" /></p> <p>ఆదివారం రాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ తగాదాలో ప్రకాశ్&zwnj;రావు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో స్పాట్&zwnj;లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన చంద్రరావు, ఏసు, సంజీవ్&zwnj;, పండు, దావీదు అనే వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఏసు, చంద్రరావు మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.&nbsp;</p> <p>విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్&zwnj;కు వచ్చారు. కేసు నమోదు చేశారు. గ్రామస్థులను ప్రశ్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పికెటింగ్ నిర్వహిస్తున్నారు.&nbsp;</p> <p>Also Read: <a title="శ్రీకాకుళం ట్రిపుల్&zwnj; ఐటీలో విద్యార్థి ఆత్మహత్య- కలకలం రేపుతున్న సూసైడ్&zwnj;లు" href="https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/iiit-student-suicide-in-srikakulam-he-is-belongs-to-prakasam-190301" target="_blank" rel="noopener">శ్రీకాకుళం ట్రిపుల్&zwnj; ఐటీలో విద్యార్థి ఆత్మహత్య- కలకలం రేపుతున్న సూసైడ్&zwnj;లు</a></p>
Read Entire Article