Israel US Iran War: లెబనాన్‌పై మరింత విధ్వంసం సృష్టిస్తామన్న ఇజ్రాయెల్! యుద్ధాలు కోరుకోవడం లేదన్న మొజ్తబా ఖమేనీ

5 days ago 2
ARTICLE AD
<p style="text-align: justify;">టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్&zwnj;తో యుద్ధం కోరుకోవడం లేదని, అయితే ఒక దేశంగా తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నామని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం కుదిరిన సమయంలో ముజ్తబా ఖమేనీ కీలక విషయాలు ప్రస్తావించారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్&zwnj;లో ఖమేనీ కొత్త లేఖ ప్రసారం అయింది. ఫిబ్రవరి 28న తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురైన కొన్ని రోజుల తరువాత కొత్త సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ ఈ సందేశం పంపారు.</p> <p style="text-align: justify;"><strong>మేం యుద్ధం కోరుకోవడం లేదు కానీ...</strong></p> <p style="text-align: justify;">ఖమేనీ తన లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. 'మేం ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ హక్కులను వదులుకోము. ఈ పోరాటంలో పాల్గొన్న అన్ని పక్షాలను విడివిడిగా కాకుండా ఒకేలా ట్రీట్ చేస్తున్నాం. ఇతర దేశాలు మా వ్యక్తిగత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు. కనుక ఇరాన్ సైన్యం ఎదురుదాడులు చేసిందని&rsquo; మోజ్తబా ఖమేనీ అన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటనను లెబనాన్&zwnj;తో ముడిపెట్టి చూస్తున్నారు. ఇజ్రాయెల్ లో ఇరాన్ మిత్రుడు హిజ్బుల్లాపై దాడులు జరుగుతున్నాయి. కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇదివరకే స్పష్టం చేశారు.</p> <p style="text-align: justify;"><strong>హర్మూజ్&zwnj;పై ఖమేనీ ఏమన్నారు?</strong></p> <p style="text-align: justify;">'మీరంతా కలిసి రోడ్లపైకి మీ డిమాండ్లను ఉంచినప్పుడు, పెద్ద పెద్ద వ్యక్తులు తమ చర్చల నిర్ణయాన్ని మార్చుకోవలసి వస్తుంది. మేం హర్మూజ్ జలసంధిని నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చాలని భావిస్తున్నాం. ఈ విషయాన్ని అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లబోతున్నాం&rsquo; అని పేర్కొన్నారు.</p> <p style="text-align: justify;">ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం మొదటి రోజునే ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోగా, ఆయన కుమారుడు 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్&zwnj;గా నియమించారు. ఈ దాడిలో మొజ్తబా సైతం గాయపడగా, సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందుకే అధికారం చేపట్టినప్పటి నుండి మొజ్తబా ఖమేనీని నేటి వరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. ఇప్పటివరకు ఆయన నుంచి లేఖ మాత్రమే విడుదలైంది.&nbsp;</p> <p style="text-align: justify;">ఆయన కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంతో పాటు ఆచూకీ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట బ్రిటన్ వార్తాపత్రిక ది టైమ్స్ ఒక నివేదికను ప్రచురించింది. అందులో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, ఇరాన్ లోని కోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన పరిపాలన చేసే స్థితిలో కూడా లేరని కూడా పేర్కొంది. అమెరికా, ఇరాన్ సీజ్ ఫైర్ ప్రకటించిన నాలుగు రోజులకు మొజ్తబా నుంచి కీలక లేఖ వెలుగులోకి వచ్చింది.</p>
Read Entire Article