Ind Vs Aus Third Test Match : గవాస్కర్ సలహా పాటిస్తున్న భారత క్రికెటర్లు-పింక్ బాల్ టెస్టు ముగిసిన తర్వాత ఏం చేశారంటే?

11 months ago 8
ARTICLE AD
<p><strong>Virat Kohli And Rohit Sharma:</strong> భారత క్రికెటర్లకు దగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ ఇచ్చిన సలహాను తూచ తప్పకుండా పాటించారు. అడిలైడ్&zwnj;లో జరిగిన రెండో టెస్టులో ఓడిన తర్వాత ఆ ప్రభావం కనిపించకుండా అడిలైడ్ మైదానంలోనే తమ సన్నాహకాల్లో మునిగి పోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్, జైస్వాల్ తదితరులు నెట్లో బిజీగా గడిపారు. ఇంతకు గావస్కర్ ఏం చెప్పారంటే.. అడిలైడ్ టెస్టులో మూడు రోజుల్లో ముగిసిందని, జట్టంతా హోటల్ రూంలకు పరిమితం కాకుంగా స్కిల్స్ పెంచుకునే పనిలో ఉండాలని సూచించారు. రెండో టెస్టులోని తప్పిదాలను సమీక్షించి, తర్వాతి టెస్టులకు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని నర్మగర్భంగా పేర్కొన్నారు. ఈనెల 6న ప్రారంభమైన రెండో టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్&zwnj;లో పది వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్.. ఐదు మ్యాచ్&zwnj;ల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ సిరీస్&zwnj;ను 1-1తో సమం చేసింది. అంతకుముందు పెర్త్&zwnj;లో జరిగిన తొలి టెస్టును 295 పరుగులతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.&nbsp;</p> <p><strong>చెమటోడ్చిన రోహిత్, కోహ్లీ..</strong><br />భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండో టెస్టులో విఫలమైన సంగతి తెలిసిందే. కోహ్లీ రెండు ఇన్నింగ్స్&zwnj;లలో కలిపి 7, 11 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ ఆవలపడే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయంపై నెట్&zwnj;లో సాధన చేసినట్లుగా తెలుస్తోంది. తొలిటెస్టులో అజేయ సెంచరీ కొట్టి ఫామ్&zwnj;లోనే ఉన్నప్పటికీ, పింక్ బాల్ టెస్టులో మాత్రం కోహ్లీకి లక్ కలిసి రాలేదు.&nbsp;</p> <p>ఇక భారత కెప్టెన్ రోహిత్ రెండో టెస్టును వీలైనంత త్వరగా మరిచిపోతే మంచిది. రెండు ఇన్నింగ్స్&zwnj;లలో కలిపి 3, 6 పరుగులతో నిరాశ పరిచాడు. బాబు పుట్టడంతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. రెండో టెస్టులో తనకు అలవాటు లేని ఆరో స్థానంలో బ్యాటింగ్&zwnj;కు దిగాడు. ఒకసారీ ఎల్బీగా, మరోసారి బౌల్డ్ రూపంలో హిట్ మ్యాన్ పెవిలియన్ కు చేరాడు.&nbsp;</p> <p><strong>Also Read: <a title="సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు" href="https://telugu.abplive.com/sports/cricket/mohammed-siraj-is-fined-20-per-cent-of-his-match-fee-while-travis-head-was-also-fined-by-the-icc-189965" target="_blank" rel="noopener">సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు</a></strong></p> <p><strong>ఓపెనర్&zwnj;గా బరిలోకి దిగాలంటున్న మాజీలు..</strong><br />మరోవైపు రోహిత్ తను రెగ్యులర్&zwnj;గా ఆడే ఓపెనింగ్ స్లాట్&zwnj;లోనే బ్యాటింగ్ చేయాలని భారత మాజీ ప్లేయర్లు సూచిస్తున్నారు. ఆసీస్&zwnj;లోని పరిస్థితులు రోహిత్ ఓపెనింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాయని గుర్తు చేస్తున్నారు. ఇకపై జరిగే మూడు టెస్టులు కూకబుర్ర బంతులతో జరగనున్నాయి. అందుకే రోహిత్ రాణించేందుకు అస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ మళ్లీ పుంజుకుంటాడని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని, తను సత్తా చాటుతాడని పేర్కొన్నారు. ఓపెనింగ్&zwnj;లోనే బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని భారత మాజీ కెప్టెన్లు రవి శాస్త్రి, గవాస్కర్ అభిప్రాయ పడుతున్నారు. &nbsp;</p> <p>రోహిత్ ఓపెనర్&zwnj;గానే బరిలోకి దిగాలని భారత మాజీలకు మద్దతుగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచిస్తున్నారు. కేఎల్ రాహుల్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడని, అందుచేత అతడిని మిడిలార్డర్&zwnj;లో పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక ప్రాక్టీస్ సెషన్&zwnj;లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తూ కనిపించారు. బ్రిస్బేన్&zwnj;లో జరిగే టెస్టులో వీరిద్దరిలో ఒకరు తుదిజట్టులో ఖాయంగా ఉంటారని తెలుస్తోంది. మూడో టెస్టులో గెలుపు భారత్&zwnj;కు తప్పనిసరి. అప్పుడే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.&nbsp;</p> <p><strong>Also Read: <a title="రోహిత్, షమీ మధ్య విబేధాలు.. అందుకే వెటరన్ పేసర్ టీమిండియాకు దూరం!" href="https://telugu.abplive.com/sports/cricket/not-all-is-well-between-shami-and-rohit-over-the-subject-of-the-veteran-pacer-s-fitness-189971" target="_blank" rel="noopener">రోహిత్, షమీ మధ్య విబేధాలు.. అందుకే వెటరన్ పేసర్ టీమిండియాకు దూరం!</a></strong></p>
Read Entire Article