<p style="text-align: justify;">మక్కా నుంచి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు సోమవారం (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 42 మంది భారత ఉమ్రా యాత్రికులు మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మక్కా నుంచి మదీనాకు తిరుగు ప్రయాణంలో ముఫ్రీహాట్ అనే ప్రదేశంలో బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్‌కు చెందినవారని, వారిలో మహిళలు, పిల్లలు, పురుషులు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. </p>
<p style="text-align: justify;"><strong>మృతులలో 18 మంది హైదరాబాదీలే..!</strong></p>
<p style="text-align: justify;">మృతుల్లో హైదరాబాద్‌ నగరానికి చెందిన 18 మంది ఉన్నారు. మృతులలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారని సమాచారం. మృతులను మల్లేపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మిగతా వారి సమాచారం కోసం అధికారులు చెక్ చేస్తున్నారు.</p>
<p>బస్సు ప్రమాదంలో మృతుల వివరాలు..<br />సౌదీలో బస్సు ప్రమాదం మృతుల్లో రహీమున్నీసా, రహమత్‌ బీ, షెహనాజ్‌ బేగం, పర్వీన్‌ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్‌ బేగం, జహీన్‌ బేగం, గౌసియా బేగం, కదీర్‌ మహ్మద్, మహ్మద్‌ మౌలానా, షోయబ్‌ మహ్మద్, సోహైల్‌ మహ్మద్, మస్తాన్‌ మహ్మద్, మహ్మద్‌ మంజూర్‌, మహ్మద్‌ అలీతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.</p>
<p style="text-align: justify;">ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రపోతున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ లీక్ కావడం ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ఉమ్రా యాత్ర పూర్తి చేసిన తరువాత, వారంతా జియారత్ కోసం వెళ్లడానికి మదీనా వైపు వెళుతున్నారు. స్థానిక అధికారుల ప్రకారం, మరణించిన వారి వివరాలు తెలియరాలేదు. అయితే బస్సులోని యాత్రికుల్లో ఒకరు మాత్రం గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో 8 మంది చనిపోగా, మరో కుటుంబంలో 7 మంది మృతిచెందారని ప్రస్తుతానికి తెలుస్తోంది.</p>
<p><strong>ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు..</strong></p>
<p>సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్, యాత్రికుల బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా చనిపోయారు. మొత్తం మృతులపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ యాత్రికులు కొందరు ఉన్నట్టు తెలియడంతో సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, తెలంగాణ నుంచి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి చర్యలు చేపట్టారు. </p>
<p>న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్లు..</p>
<p>వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044</p>
<p>సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143.</p>
<p>రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157.</p>
<p style="text-align: justify;"><strong>తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం </strong></p>
<p style="text-align: justify;">సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిని గుర్తించాలని, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణ సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది, తద్వారా కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en">In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgirms, a 24x7 Control Room has been set up in Consulate General of India, Jeddah. <br /><br />The contact details of the Helpline are as under:<br /><br />Toll free number-<br />8002440003<a href="https://twitter.com/MEAIndia?ref_src=twsrc%5Etfw">@MEAIndia</a> <a href="https://twitter.com/IndianDiplomacy?ref_src=twsrc%5Etfw">@IndianDiplomacy</a>…</p>
— India in Jeddah (@CGIJeddah) <a href="https://twitter.com/CGIJeddah/status/1990282761559560259?ref_src=twsrc%5Etfw">November 17, 2025</a></blockquote>
<p style="text-align: justify;">
<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>
</p>
<p style="text-align: justify;"><strong>సహాయం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు<br /></strong></p>
<p style="text-align: justify;">సీఎం <a title="రేవంత్ రెడ్డి" href="https://telugu.abplive.com/topic/Revanth-Reddy" data-type="interlinkingkeywords">రేవంత్ రెడ్డి</a> కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీ రాయబార కార్యాలయ అధికారులతో కలిసి తెలంగాణకు చెందిన ప్రభావిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారుకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీలో నియమించిన సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడి సమాచారం సేకరిస్తున్నారు. </p>