Guntur Latest News: గుంటూరు జిల్లా గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే కంటపడటంతో వెలుగులోకి!

3 months ago 8
ARTICLE AD
<p><strong>Guntur Latest News:</strong> ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. ఎన్నో పనులు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవన్నీ వృథాగా మారుతున్నాయి. అలాంటి ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులు చూసింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాలం చెల్లిన మందుల వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే పర్యటనలో ఇదంతా వెలుగు చూడటంతో స్థానికంగా ఈ విషయం వైరల్ అవుతోంది.&nbsp;&nbsp;</p> <p>పెదనందిపాడు మండల పరిధిలో &nbsp;రావిపాడులో పల్లె పండగలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే చాలా పనులకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్నింటికి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న స్కూల్, ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇలా పరిశీలిస్తున్న టైంలోనే కాలం చెల్లిన మందుల వ్యవహారం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనిపై బూర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.&nbsp;</p> <p>గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఉండటంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితి ఉంటే స్థానికంగా ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం వృథా అవుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే జిల్లా వైద్య అధికారితో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.&nbsp;</p> <p>ఈ స్థాయిలో ప్రభుత్వం ధనం వృథాగా పోతుంటే తనిఖీలు చేపట్టలేదని ఉన్నతాధికారులను క్వశ్చన్ చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాను పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయక ముందే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. లేకుంటే అందరూ జరగబోయే పరిణామాలకు బాధ్యులు అవుతారని వార్నింగ్ ఇచ్చారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని, సిబ్బంది ఏం చేస్తున్నారని ఆరా తీయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు.&nbsp;</p> <p>"రావిపాడు పెద్ద గ్రామం, విలేజ్&zwnj; క్లినిక్ ఉంది. అందులో ఉండే మందులు ఎక్స్&zwnj;పేర్ అయ్యాయి. అవన్నీ వృథాగా పడి ఉండటం దురదృష్టకరం. ప్రభుత్వం డబ్బులు పెట్టి కొన్న మందులు ఇక్కడ అవసరం లేకుంటే వేరే చోటికి తరలించాలి. అవసరం ఉన్న చోట వాడుకోవాలి. ఇక్కడ మాత్రం ఊరికే పారేశారు. బాధులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యలను కోరాను. " అని మీడియాకు ఎమ్మెల్యే వివరించారు.&nbsp;&nbsp;</p> <p>ప్రజలకు మేలు చేయాలని భారీగా కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఎమ్మెల్యే వివరించారు. వాటిని సక్రమంగా ప్రజలకు చేరువ చేసేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ఎక్కడ ఒక్కరు సరిగా పని చేయకపోయినా దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటివి రిపీట్ కాకూడదని అన్నారు. తర్వాత ప్రజలతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలపై ఆరా తీశారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు గురించి తెలుసుకున్నారు. అందరూ కలిసి కట్టుగా శ్రమించి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a>ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను కచ్చితంగా పరిశీలిస్తామని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.</p> <p>ఎమ్మెల్యే టూర్&zwnj;లో వెలుగులోకి వచ్చిన కాలం చెల్లిన మందుల వ్యవహారం జిల్లాలోనే హాట్ టాపిక్ అయింది. దీనికి బాధ్యులు ఎవరు అని విచారిస్తున్న జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే కింది స్థాయి సిబ్బంది మాత్రం అవి ఎప్పటి నుంచో ఉన్నాయని వాటిని రోగులకు ఇవ్వలేదని, అందుకే వేరే ప్రాంతంలో పెట్టినట్టు చెబుతున్నారు. &nbsp;&nbsp;</p>
Read Entire Article