Godavari Serial Today May 25th: 'గోదావరి' సీరియల్: శంకర్ ఇంట్లో లవ్ లెటర్ గొడవ! మురళీ బాధ పడటానికి కారణమేంటి?

1 week ago 3
ARTICLE AD
<p><strong>Godavari Serial Today Episode</strong> | ఇటీవల ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న "గోదావరి" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్&zwnj;లు టర్న్&zwnj;లతో ఆసక్తికరంగా మారుతోంది. మురళీ ప్రేమకి సపోర్ట్ చేస్తున్న సూర్య మురళీ అలకనందకి రాసినట్లు లవ్ లెటర్ రాసి అది ఇవ్వడానికి తానే జాను వాళ్ల ఇంటికి వెళ్లడం తదితర ఆసక్తికర సీన్స్&zwnj;తో సీరియల్ చాలా ఇంట్రస్టింగ్&zwnj;గా సాగుతోంది.. ఈ రోజు(మే 25న) ప్రసారం కానున్న ఎపిసోడ్&zwnj;లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.<br />&nbsp;<br /><strong>&nbsp;బావకి సపోర్ట్ చేస్తాడా.. ఇతని పని చెప్తా..</strong></p> <p>మురళీ కోసం సూర్య లవ్ లెటర్ రాసి ఇవ్వమని అంటాడు. మురళీ భయపడటంతో తానే ఇస్తా అని జాను వాళ్ల ఇంటికి వెళ్తాడు. నందు అక్కడ మొక్కలకు నీరు పోయడం చూసి పిలుస్తాడు. కానీ నందు చూడదు. ఇంతలో అలకనంద చెల్లి రావడం చూసి పాప దగ్గరకు వెళ్లి ఈ లెటర్ మీ అలకనంద అక్కకి ఇవ్వు అని చెప్తాడు. సరే అని నందు దగ్గరకు వాళ్ల చెల్లి తీసుకెళ్లి ఇస్తుంది. నందు సూర్యని చూసి ఇతను నాకు లైన్ వేస్తున్నాడా ఏంటి అని అనుకుంటుంది. లెటర్ చదివిన నందు బావ ఇతనితో లెటర్ పంపాడా.. బావకి సపోర్ట్ చేసిన ఇతని పని చెప్తా అని అనుకుంటుంది. పాపని మురళీ దగ్గరకు పంపి సమాధానం చెప్తా రమ్మను అని కిన్నెరతో చెప్పిస్తుంది.&nbsp;</p> <p><strong>గౌతమికి లవ్ లెటర్..</strong></p> <p>నందు లోపలికి వెళ్లి బయట ఎవరో గౌతమికి లవ్ లెటర్ రాశారు అని చెప్తుంది. నాకు ఏం సంబంధం లేదు అని గౌతమి &nbsp;అంటుంది. సూర్య లోపలికి రావడంతో అందరూ గుర్తు పట్టి బాబు నువ్వు లవ్ లెటర్ రాయడం ఏంటి అని అడుగుతారు. ఇతనితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు నాకు ఏం తెలీదు అని గౌతమి అంటే నేను మీకు లవ్ లెటర్ రాయలేదు అండీ అని సూర్య అంటాడు. మరి జానుకి రాశావా అని నందు అంటే లేదు అంటాడు. మరి నాకు రాశావా.. నాకు మా వాళ్లు ఎన్నారై సంబంధం చూస్తున్నారు అని అంటుంది. నాన్న పిల్లలకు పెంచడం చేతకాదా అని వీళ్ల అమ్మ ఎన్ని మాటలు అంది ఆవిడకు కాల్ చేయండి అని జాను అంటుంది. శంకర్ చేస్తుంటే సూర్య వద్దని అంటాడు. నువ్వు చేసిన పని బాలేదు బాబు నువ్వు సింహాద్రి మేనల్లుడివి కాకపోయి ఉంటే వేరేలా ఉండేది అని అంటాడు.</p> <p><strong>నేను లవ్ లెటర్ రాశాను మామయ్య..</strong></p> <p>మురళీ ఇంటికి వచ్చి మామయ్య ఆ లెటర్ నేనే రాశాను అంటాడు. నువ్వు రాశావు అని నాకు తెలుసు.. నాన్న మా అల్లుడు మంచోడు అంటావు కదా ఇప్పుడేంటి అని అంటుంది. జాను నువ్వు బావని వెనకేసుకొస్తావ్ కదా ఇప్పుడు చెప్పు అని నందు అడుగుతుంది.&nbsp;</p> <p><strong>అలకనందకి ఎన్నారై సంబంధం కుదిరిందిరా..&nbsp;</strong></p> <p>శంకర్ మురళీని పక్కకి తీసుకెళ్లి అలకనందకి ఎన్నారై సంబంధం కుదిరిందిరా.. వాళ్లు చూడటానికి రేపే వస్తున్నారురా అని అంటాడు. నందు అదే కోరుకుంది కదా.. మంచిదే మామయ్య.. చిన్నప్పుడు నుంచి నందుకి నేను అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేదు అని మురళీ కన్నీరు పెట్టుకుంటాడు. తనకి ఏది మంచిదో అదే చేయండి అని అంటాడు. నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది అంటారు కానీ నీ విషయంలో అది జరగనందుకు బాధగా ఉందిరా.. నీ బాధ నాకు అర్థమవుతున్నా.. కూతురి కోసం తప్పడం లేదురా.. నాకు అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వేరా రేపు పెళ్లి చూపులకు నువ్వే వచ్చి దగ్గరుండి చూసుకోవాలి అని శంకర్అంటాడు. తప్పకుండా మామయ్య పెళ్లి పనులు నేనే చూసుకుంటా అని మురళీ అంటాడు.</p> <p><strong>ఇంటి నుంచి వెళ్లిపోతున్న బామ్మ..</strong></p> <p>జాను సూర్యతో మా అక్కకి పెళ్లి చూపులు అని తెలిసి కూడా ఇలా చేస్తారా అని అడుగుతుంది. మరోవైపు బామ్మ బ్యాగ్ సర్దేసి ఈ ఇంట్లో ఉండను అని వెళ్లపోతుంటే అందరూ వెంటపడి ఉండమని బతిమాలుతారు. నీ కూతురు అయిన సంబంధం కాదని దేశం విడిచిపోతా అంటుంది.. నా మనవడని అవమానిస్తుంది. నేను ఇక్కడ ఉండను అని బామ్మ అంటే నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్తే నా మీద ఒట్టే అని మురళీ బామ్మని ఒప్పించి అక్కడే ఉండేలా చేస్తాడు. మురళీ మాటలకు బామ్మ కన్నీరు పెట్టుకుంటుంది. మురళీ సూర్యని తీసుకొని వెళ్లిపోతాడు.&nbsp;</p> <p><strong>తల్లి ఒడిలో పడుకొని ఏడ్చేసిన మురళీ..</strong></p> <p>మురళీ నందు మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. శాంతి కొడుకు దగ్గరకు వచ్చి నీకు మరో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా అన్నాను అని బాధ పడుతున్నావా అని అడుగుతుంది. మురళీ తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడు. అలకనంద కాదు అన్నంత మాత్రానా మీ పెళ్లి జరగదా.. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని నా కాళ్ల దగ్గరకు వస్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే సంబంధం వస్తుందని శాంతి అంటుంది.&nbsp;</p> <p><strong>గౌతమికి కాల్ చేసిన జశ్వంత్..</strong></p> <p>&nbsp;గౌతమికి తన లవర్ సింహాద్రి కొడుకు జశ్వంత్ కాల్ చేస్తాడు. నందు అక్కకి ఎన్నారై సంబంధం వచ్చిందని గౌతమి సంతోషంగా చెప్తుంది. ఇంతలో నందు వచ్చి గౌతమి ఫోన్ లాక్కొని ఎవరితో మాట్లాడుతున్నావే అని ఫోన్ తీసుకుంటుంది. జశ్వంత్ నెంబరు కదా అని అంటుంది. జశ్వంత్తో నీకు మాటలు ఏంటే అని అంటే కాలేజ్&zwnj;కి వెళ్లడం లేదు కదా ఏం జరిగిందో అని తెలుసుకుందామని అంటుంది. ఇంతలో కిన్నెర వచ్చి రా అక్క నువ్వు పక్కన లేకపోతే పడుకోను అని గోల చేసి నందుని తీసుకెళ్లిపోతుంది.&nbsp;</p> <p>జాను తండ్రితో ఇక మీదట మీరు దుబాయి వెళ్లరు నాన్న. ఇక్కడే ఉంటారు.. మీకు ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయినా నేనే అని అంటుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వచ్చేస్తున్నారని ఫోన్ వస్తుంది. అందరూ పెళ్లి చూపుల కోసం హడావుడి చేస్తారు. సింహాద్రి పెళ్లి వాళ్లని తీసుకొని వస్తారు. బావగారిని చూద్దాం అని గౌతమి, నందు, జాను తొంగి చూస్తారు. నందుని రౌడీ అయి రమ్మని అంటారు. పెళ్లి చూపుల కోసం నందు కొన్న కొత్త చీర చిరిగిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.&nbsp;</p> <p><strong>&nbsp;ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్&zwnj;లో ఏం జరగనుంది? &nbsp;ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.&nbsp;</strong></p> <p>&nbsp;</p>
Read Entire Article