Dhar Gang In East Godavari: ద‌డ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్‌.. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని పోలీసులు హెచ్చ‌రిక‌

2 months ago 3
ARTICLE AD
<p>ఉభ&zwnj;య గోదావ&zwnj;రి జిల్లాలోని ప్ర&zwnj;జ&zwnj;లు అప్ర&zwnj;మ&zwnj;త్తంగా ఉండాలంటూ ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చ&zwnj;రించ&zwnj;డంతో ఇక్క&zwnj;డి ప్ర&zwnj;జ&zwnj;లు తీవ్ర క&zwnj;ల&zwnj;వారినికి గుర&zwnj;వుతున్నారు.. మ&zwnj;ధ్య ప్ర&zwnj;దేశ్ నుంచి ఇక్క&zwnj;డికి వ&zwnj;చ్చి దోపిడీలు చేసే ధార్ గ్యాంగ్ గురించి పోలీసులు హెచ్చ&zwnj;రిక&zwnj;లు సోష&zwnj;ల్ మీడియాలో స&zwnj;ర్కులేట్ అవుతుండ&zwnj;డంతో ప్ర&zwnj;జ&zwnj;లు భ&zwnj;యాందోళ&zwnj;న&zwnj;ల&zwnj;కు గుర&zwnj;వుతున్నారు.. ఇప్ప&zwnj;టికే మ&zwnj;ద్య&zwnj;ప్ర&zwnj;దేశ్&zwnj;కు చెందిన ధార్ గ్యాంగ్&zwnj;తోపాటు ఉత్త&zwnj;ర ప్ర&zwnj;దేశ్&zwnj;కు చెందిన మ&zwnj;రో గ్యాంగ్&zwnj;ల వ&zwnj;రుస దోపిడీలు వెలుగులోకి రావ&zwnj;డంతో పోలీసులు మ&zwnj;రింత అప్ర&zwnj;మ&zwnj;త్తమ&zwnj;య్యారు.. లూటీ చేస్తున్న క్ర&zwnj;మంలో ఎవ్వ&zwnj;రైనా అడ్డువ&zwnj;చ్చినా చంపేందుకు వెనుకాడ&zwnj;ని ఈ గ్యాంగ్ కోసం ప్ర&zwnj;త్యేక పోలీసు బృందాలు జ&zwnj;ల్లెడ ప&zwnj;డుతున్నాయి..&nbsp;</p> <p><strong>ఇప్ప&zwnj;టికే ప&zwnj;లు చోట్ల దొంగ&zwnj;త&zwnj;నాలు..</strong></p> <p>ఏపీలో &nbsp;ఇటీవ&zwnj;ల కాలంలో ప&zwnj;లు చోట్ల జ&zwnj;రిగిన దొంగ&zwnj;త&zwnj;నాల శైలిని ప&zwnj;రిశీలించిన పోలీసులు ఈ ప&zwnj;ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దార్ గ్గ్యాంగ్, అలాగే మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్&zwnj;లకు చెందిన మరికొన్ని గ్యాంగ్&zwnj;లు చేసిన&zwnj;వేన&zwnj;ని నిర్ధార&zwnj;ణ&zwnj;కు వ&zwnj;చ్చారు. దొంగ&zwnj;త&zwnj;నాలు జ&zwnj;రిగిన ప&zwnj;ద్ద&zwnj;తిని బ&zwnj;ట్టి గ&zwnj;తంలో చోటుచేసుకున్న ప&zwnj;లు సంఘ&zwnj;ట&zwnj;న&zwnj;ల&zwnj;కు ఆధారంగా ఎవ్వ&zwnj;రు పాల్ప&zwnj;డి ఉంటార&zwnj;న్న అంచ&zwnj;నా వేసే ప&zwnj;రిస్థితి ఉండ&zwnj;గా &nbsp;గత పది రోజులుగా నెల్లూరు, కాకినాడ, నల్లజర్ల వంటి ప్రాంతాల్లో రాబరీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ గ్యాంగ్&zwnj;ల ప&zwnj;నేన&zwnj;ని నిర్ధారించుకునే ఈ ప్ర&zwnj;క&zwnj;ట&zwnj;న వెలువ&zwnj;రించిన&zwnj;ట్లు తెలుస్తోంది.. &nbsp;ఈ గ్యాంగ్&zwnj;లు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా చురుగ్గా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.</p> <p><strong>ప&zwnj;గ&zwnj;టిపూట రెక్కీ.. ఆపై రాత్రిపూట దోపిడీ..</strong></p> <p>మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ గ్గ్యాంగ్, అలాగే మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్&zwnj;లకు చెందిన మరికొన్ని గ్యాంగ్&zwnj;లు రాష్ట్రంలోకి చొర&zwnj;బ&zwnj;డి గత పది రోజులుగా ప&zwnj;దుల సంఖ్య&zwnj;లో దోపిడీల&zwnj;కు పాల్ప&zwnj;డిన నేప&zwnj;థ్యంలో ఈ గ్యాంగ్&zwnj;ల క&zwnj;ద&zwnj;లిక&zwnj;ల&zwnj;పై పోలీసులు నిఘా పెట్టారు. వీరు పాల్ప&zwnj;డిన దోపిడీల ఘ&zwnj;ట&zwnj;నా స్థలాల వ&zwnj;ద్ద సీసీ కెమెరా పుటేజీల ద్వారా అంచాన&zwnj;వేసిన పోలీసులు ఈ ధార్ గ్యాంగ్&zwnj;కు చెందిన ఓ ముఠా నాయ&zwnj;కుని ఫొటో కూడా విడుద&zwnj;ల చేశారు. వీరు పగటిపూట ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లను, తాళాలు వేసిన ఇళ్లను గమనించి, రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడ&zwnj;తార&zwnj;ని పోలీసులు చెబుతున్నారు.</p> <p>ముఖ్యంగా హైవేల&zwnj;ను ఆనుకుని ఉన్న ఆవాస&zwnj;ప్రాంతాల&zwnj;తోపాటు హైవేల&zwnj;నుంచి క&zwnj;నెక్టివీటీ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటార&zwnj;ని, అదేవిధంగా సిటీలను ఆనుకుని ఉన్న ఇళ్ల&zwnj;ను, విశాల స్థ&zwnj;లంలో ఒంట&zwnj;రిగా ఉన్న ఇళ్ల&zwnj;ను కూడా టార్గెట్ చేస్తుంటార&zwnj;ని హెచ్చ&zwnj;రిస్తున్నారు.. రాత్రివేళ&zwnj;ల్లో త&zwnj;లుపులు కొట్టినా, ఏదైనా చంటిపిల్ల&zwnj;ల ఏడుపులు విన&zwnj;ప&zwnj;డినా కంగారు ప&zwnj;డి త&zwnj;లుపులు తీయ&zwnj;కూడ&zwnj;ద&zwnj;ని సూచిస్తున్నారు. ఎక్కువ&zwnj;గా ప&zwnj;గ&zwnj;టి పూట ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వ&zwnj;హించి ఆపై రాత్రివేళ&zwnj;ల్లో ముసుగులు ధ&zwnj;రించి మార&zwnj;ణాయుధాల&zwnj;తో దోపిడీల&zwnj;కు పాల్ప&zwnj;డ&zwnj;తార&zwnj;ని చెబుతున్నారు. &nbsp;&nbsp;</p> <p><strong>ఉమ్మ&zwnj;డి తూర్పుగోదావ&zwnj;రి జిల్లాలో అలెర్ట్&zwnj;..&nbsp;</strong></p> <p>ఉమ్మ&zwnj;డి తూర్ప&zwnj;ు గోదావ&zwnj;రి జిల్లా ప&zwnj;రిధిలోని తూర్పుగోదావ&zwnj;రి, కాకినాడ&zwnj;, అంబేడ్క&zwnj;ర్ కోన&zwnj;సీమ జిల్లాల ఎస్పీలు ఇప్ప&zwnj;టికే వేర్వేరుగా హెచ్చ&zwnj;రిక ప్ర&zwnj;క&zwnj;ట&zwnj;న&zwnj;లు జారీ చేశారు. తూర్పుగోదావ&zwnj;రి జిల్లా ప&zwnj;రిధిలోని హైవేల&zwnj;కు ఆనుకుని ఉన్న ప&zwnj;లు ప్రాంతాల&zwnj;తోపాటు సిటీను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచ&zwnj;రించే అవ&zwnj;కాశం ఉంద&zwnj;ని తెలిపారు. అదే విధంగా కాకినాడ జిల్లాలోనూ హైవేల&zwnj;కు ఆనుకుని ఉన్న ప్రాంతాల ప్ర&zwnj;జ&zwnj;లు అప్ర&zwnj;మ&zwnj;త్తంగా ఉండాలంటూ హెచ్చ&zwnj;రించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ఏరియాల్లో ఈ గ్యాంగ్&zwnj;లు దొంగతనాలు చేసే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు కనిపిస్తే, వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.&nbsp;</p>
Read Entire Article