Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్’​.. కేటీఆర్​ పోస్ట్​

9 months ago 8
ARTICLE AD
<p>బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ సోషల్​ మీడియా ఎక్స్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేశారు. &lsquo;బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​&rsquo; అంటూ పోస్ట్​ పెట్టారు. దీనికి రాహుల్​ గాంధీ గురించి ఆయన &nbsp;గతంలో మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్​ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలోనే కేటీఆర్​ ఈ పోస్ట్​ పెట్టినట్లు తెలుస్తోంది.</p> <p>బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే..<br />మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్​ గాంధీకి కంగ్రాట్స్​ అంటూ కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్​ ఎక్స్​లో ట్రెండ్​ అవుతోంది. ఈ పోస్ట్​కు గతంలో తాను ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను కేటీఆర్​ జతచేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉంటే అది రాహుల్​ గాంధీనే అని ఎద్దేవా చేశారు.</p> <p>బీజేపీని నిలువరించే సత్తా రాహుల్​కు లేదు<br />ఆ వీడియోలో కేటీఆర్​ మాట్లాడుతూ.. &nbsp;&lsquo;రాహుల్​ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదు. ఒకవేళ ఆయనకు ఆ దమ్ము ఉంటే వెళ్లి ఉత్తర్​ప్రదేశ్​లో, గుజరాత్​లో, బిహార్​లో ఆ పార్టీతో కొట్లాడాలి. కానీ అలా చేయకుండా తెలంగాణకు వచ్చి బీజేపీని నిలువరించే సత్తా ఉన్న నేతలతో పోరాడతానంటారు. ​దేశంలో మోదీకి ఉన్న అతి పెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే. ఆయన లాంటి వ్యక్తి ఉన్నంతకాలం <a title="నరేంద్ర మోదీ" href="https://telugu.abplive.com/topic/narendra-modi" data-type="interlinkingkeywords">నరేంద్ర మోదీ</a> ఏమైనా చేయలరు. ఎంతకాలమైనా దేశాన్ని పాలించగరు&rsquo; అని అన్నారు.</p> <p>అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా?&nbsp;<br />ప్రస్తుతం దేశంలో బీజేపీని నిలువరించేవి అవి కేవలం రీజినల్​ పార్టీలు, స్ట్రాంగ్​ లీడర్లైన <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a>​, కేజ్రీవాల్​, మమతా బెనర్జీ స్టాలిన్​ లాంటి వారు మాత్రమేనన్నారు. దేశమంతా భారత్​ జోడో యాత్ర చేపట్టిన రాహుల్​ గాంధీ గుజరాత్​లో ఎందుకు చేయలేదని అడిగారు. మ్యాచ్​ ఫిక్సింగా లేక మోదీ అంటే రాహుల్​కు భయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అస్త్రసన్యాసం చేసే రాహుల్​ గాంధీ అసలు నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేత ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్​ పార్టీ మోదీని ఏం ఎదుర్కొంటుంది, బీజేపీని ఎలా ఓడిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో కేటీఆర్​ చేసిన ఈ పోస్ట్​ వైరల్​ అవుతోంది.</p> <p>బీజేపీ 45.. ఆమ్​ ఆద్మీ 5<br />ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 36 స్థానాల మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది. <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> 45 స్థానాల్లో లీడింగ్​లో ఉంటే ఆమ్​ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a>​తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.</p> <p>వెనుకబడ్డ కేజ్రీవాల్​, సీఎం ఆతిషీ<br />ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ ఆప్​ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్​, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్​లో వెనుకబడిపోయారు. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.</p>
Read Entire Article