Cyber Fraud Cases : సైబర్ మోసాల కేసుల్లో భారత్ టాప్‌! ఇలాంటి టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

2 days ago 2
ARTICLE AD
<p><strong>Cyber Fraud Cases :</strong>భారత్ సైబర్ మోసాల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ జబ్బార్ ఈ విషయాన్ని తెలియజేశారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అనేక రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.&nbsp;</p> <p>ఆయన మాట్లాడుతూ, &ldquo;OTP, వీడియో లింక్&zwnj;లు, ఇమేజ్ లింక్&zwnj;లు మోసాల్లో చాలా సాధారణం. OTP, వీడియో లింక్&zwnj;లు, మొబైల్ నంబర్&zwnj;ల ఇమేజ్ లింక్&zwnj;లు, ఒకవేళ బాధితుడు ఆ లింక్&zwnj;పై క్లిక్ చేస్తే లేదా OTPని షేర్ చేస్తే, అతనికి నష్టం జరగవచ్చు. లింక్&zwnj;లు క్లిక్ చేయడం సైబర్ నేరాల్లో మరింత భయంకరమైనది, ఎందుకంటే &nbsp;మోసగాడు మీ మొబైల్&zwnj;ను పూర్తిగా యాక్సెస్ చేసే వీలుంటుంది. వారు మీ ఫోన్&zwnj;లోని ఫోటోలు, వీడియోలను ఇతర వివరాలను కూడా చూడగలడు.&rdquo;</p> <h3>'కాల్ మోసం నేరం'</h3> <p>ఆయన ఇంకా మాట్లాడుతూ, కాల్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు, కానీ అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ హోల్డర్&zwnj; వారితో మాట్లాడకూడదు, అలాంటి కాల్ వెంటనే డిస్&zwnj;కనెక్ట్ చేయాలి. లేకపోతే, వారు 2 నుంచి 3 నిమిషాల్లో మీ మొబైల్&zwnj;ను హ్యాక్ చేస్తారు.</p> <h3>'AI ద్వారా జరిగే మోసాలు'</h3> <p>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే మోసాల గురించి మాట్లాడుతూ, మోసగాళ్ళు మీ కుటుంబ సభ్యుల పేరుతో కాల్స్ చేస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్&zwnj;ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. డబ్బును పంపమని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ముందుగా కాల్&zwnj; చేసింది ఎవరో తెలుసుకోవాలి. నిజంగా మీకు తెలిసిన వ్యక్తులే కాల్ చేశారా అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వారి చెప్పింది చేయాలని.</p> <h3>'సీనియర్ సిటిజన్&zwnj;లే లక్ష్యం'</h3> <p>దాదాపు అన్ని వయసుల వాళ్లు ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఎక్కువగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులు సాధారణంగా మోసగాళ్ల లక్ష్యంగా మారుతున్నారని ఆయన అన్నారు. దీనితో పాటు, చదువుకున్న, నిరుద్యోగులు కూడా మోసగాళ్ల సాధారణ లక్ష్యంగా ఉన్నారు. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో అవగాహన కల్పించాలి.</p> <h3>బాధితుడు తన అనుభవాన్ని వివరించాడు</h3> <p>బాధితుడు సయ్యద్ యూసుఫ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, ఇటీవల తన స్నేహితుడి మొబైల్ నంబర్&zwnj;కు WhatsApp సందేశం వచ్చిందని, అందులో వెంటనే 48,000 రూపాయలు పంపమని కోరారని చెప్పారు. నేను అతనితో క్రాస్ చెక్ చేసినప్పుడు, అతని WhatsApp, Facebook ID హ్యాక్ అయ్యిందని, ఎటువంటి డబ్బును పంపవద్దని నాకు చెప్పాడు.</p>
Read Entire Article